Nikhat Zareen | తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ 2022ను ఘనంగా ముగించింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ వేదికగా జరిగిన జాతీయ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో అద్భుతంగా రాణించి టైటిల్ కైవసం చేసుకుంది. వరుసగా అన్ని బౌట్లలో విజయం సాధిస్తూ ఏకపక్షంగా టైటిల్ దక్కించుకుంది.
జాతీయ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో 50 కేజీల విభాగంలో పోటీ పడిన నిఖత్ జరీన్ ఫైనల్లో రైల్వేస్కు చెందిన అనామికతో పోటీపడింది. మొదట్నుంచి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా దూకుడు ప్రదర్శించింది. దీంతో అనామిక ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. ఐదు రౌండ్లలో చివరి దాంట్లో మాత్రమే జరీన్ కంటే అనామిక ఎక్కువ పాయింట్లు సాధించగలిగింది. ఒక బౌట్ గెలిచినా ఆమెకు ఫలితం లేకుండా పోయింది. చివరకు అనామికను 4-1 తేడాతో ఓడించి జాతీయ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ ను నిఖత్ జరీన్ కైవసం చేసుకున్నది.
నిఖత్ జరీన్ కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణం , ప్రపంచ ఛాంపియన్ షిప్లో స్వర్ణం సాధించింది. భారత ఖ్యాతిని దశదిశలా చాటింది. దీంతో భారత ప్రభుత్వం ఆమె ప్రతిభను గుర్తించి అర్జున అవార్డును కూడా ప్రకటించింది. ఇప్పుడు జాతయ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో అద్భుతంగా రాణించి టైటిల్ కైవసం చేసుకుంది.
Read More Articles :
chalapathi rao | చలపతిరావు అంటే హీరోయిన్స్కు భయం.. ఆయన ఉన్న హోటల్కు అస్సలు వెళ్లేవాళ్లు కాదు
Chalapathi Rao | టాలీవుడ్లో మరో విషాదం.. గుండెపోటుతో చలపతిరావు హఠాన్మరణం
chalapathi rao | చలపతిరావు జీవితంలో సినిమాటిక్ లవ్ స్టోరీ.. అమ్మాయిని చూసిన వారం రోజుల్లోనే పెళ్లి