Republic Day | తెలంగాణలో భారత రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్లోని రాజ్ భవన్లో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం.. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులను ఆమె సత్కరించారు.
సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్, భగవాన్ మహావీర్ విక్లాంగ్ సహాయత సమితి (ఎన్జీవో), విద్యావేత్త బాలలత, కుడుముల లోకేశ్వరి ( పారా అథ్లెటిక్స్ ), టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి ఆకుల శ్రీజను సత్కరించారు. అంతకుముందు హైదరాబాద్లోని వార్ మెమోరియల్ వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అమరవీరులకు నివాళులు అర్పించారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Women’s IPL | పురుషుల ఐపీఎల్ను మించిపోయిన మహిళల లీగ్.. రికార్డు ధరకు వేలం