Ration Cards | ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే పేదలందరికీ కొత్త రేషన్కార్డులు ఇవ్వనున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీలో మాట్లాడిన ఆయన.. పేదలందరికీ కొత్త రేషన్ కార్టులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
అర్హులైన పేదలందరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తామని గతంలో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. పేద ప్రజల నుంచి దరఖాస్తులను కూడా ఆహ్వానించింది. కొత్తగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన అధికారులు.. దరఖాస్తుదారుల ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారు. కానీ ఇప్పటివరకు రేషన్ కార్డులను ప్రభుత్వం జారీ చేయలేదు. దీంతో చాలామంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను క్లియర్ చేసి వెంటనే రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రతిపక్షాలు ఎప్పటి నుంచో ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. కానీ ప్రభుత్వం ఈ విషయంలో ఆలసత్వం వహిస్తూనే ఉంది. ఇప్పుడు త్వరలోనే పేదలకు కొత్త రేషన్ కార్డులు అందజేస్తామని మంత్రి ప్రకటించడంతో.. త్వరలోనే కార్డులు అందుతాయని దరఖాస్తుదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Telangana Assembly | వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని శాసనసభ ఏకగ్రీవ తీర్మానం
CM KCR | ఇకపై పోడు భూములకు రైతుబంధు.. ఆదివాసీలకు గిరిజనబంధు.. తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన
Bandi Sanjay | సచివాలయం డోమ్లు కూల్చేస్తాం.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు