Accident | నల్గగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తాపడి 9 మందికి గాయాలయ్యాయి. ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు గుంటూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా చిట్యాల మండలం వట్టిమర్తి స్టేజీ వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. మంగళవారం ఉదయం 5 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
ప్రమాదంలో డ్రైవర్ తో పాటు 8 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 30 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది.
Read More Articles |
Anjali Marriage | అతనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నా.. పెళ్లి వార్తలపై స్పందించిన అంజలి
India-China troops clash | భారత్-చైనా సరిహద్దులో ఘర్షణపై రాజ్నాథ్ సింగ్ లోక్సభలో కీలక ప్రకటన..
Google Meet | ఆడియోను టెక్ట్స్గా మార్చే ఫీచర్ తీసుకొస్తున్న గూగుల్
Whatsapp Deleted Messages | వాట్సాప్లో డిలీట్ అయిన మెసేజ్లను ఇలా చూడొచ్చు
Whatsapp Tricks | ఫోన్ నంబర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్లో మెసేజ్ ఇలా పంపించండి
Google Search | గూగుల్లో ఈ పదాలను అస్సలు సెర్చ్ చేయకండి