Wednesday, April 24, 2024
- Advertisment -
HomeSlideBandi Sanjay yatra | బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలను కేసీఆర్‌ బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు.. బండి సంజయ్‌ సెన్సేషనల్‌...

Bandi Sanjay yatra | బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలను కేసీఆర్‌ బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు.. బండి సంజయ్‌ సెన్సేషనల్‌ కామెంట్స్‌

Bandi Sanjay yatra | తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫాంహౌస్‌ కేసులో ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల్లో కొందరిపై డ్రగ్స్‌ ఆరోపణలు ఉన్నాయని ఆరోపించారు. డ్రగ్స్‌ కేసు వ్యవహారాన్ని, ఇందులో ఉన్న ఎమ్మెల్యేలను వదిలిపెట్టబోమన్నారు. ఎవరెవరు ఈ కేసులో ఉన్నారనే విషయం తెలుసుకునేందుకు బెంగళూరుకు లీగల్‌ టీంను పంపినట్లు బండి సంజయ్‌ తెలిపారు. ఈ విషయం తెలియగానే హడావిడిగా ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారని ఆరోపించారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు చేసిన తప్పుల చిట్టా కేసీఆర్‌ దగ్గర ఉందని ఆరోపించారు. దాని బూచిగా చూపి ఎమ్మెల్యేలను కేసీఆర్‌ బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారని విమర్శించారు.

మోదీ స్ఫూర్తితోనే పాదయాత్ర

జగిత్యాల జిల్లా గంగాధర మండలం తుర్గాసిపల్లి శిబిరం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన బండి.. పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. మోదీ స్ఫూర్తితో క్షేత్ర స్థాయిలో ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తున్నట్లు చెప్పారు.

వ్యాక్సిన్‌ కావాలా.. వైరస్ కావాలా?

రాష్ట్రంలో కొన్ని పార్టీలు ఏసీ గదుల్లో కూర్చొని ఎజెండాలు తయారు చేస్తుంటే తాము మాత్రం ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలను పరిష్కరించే ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని బండి అన్నారు. బీఆర్ఎస్‌ అనేది ఓ వైరస్‌ అయితే బీజేపీ వ్యాక్సిన్ అని అన్నారు. ప్రజలకు వ్యాక్సిన్‌ కావాలో వైరస్‌ కావాలో తేల్చుకోవాలని పిలుపునిచ్చారు.

ప్రభుత్వం మారాలని కోరుకుంటున్నారు

నారాయణపూర్‌ రిజర్వాయర్‌ ముంపు నిర్వాసితులను ఇప్పటివరకు ఎందుకు ఆదుకోలేకపోయారని ప్రభుత్వాన్ని బండి ప్రశ్నించారు. కొండగట్టు బస్సు ప్రమాద బాధిత కుటుంబాలను ఇప్పటివరకు ఆదుకోలేకపోయారని, డ్రగ్స్‌, నయీమ్‌ కేసుల్లో సిట్‌ నివేదికలు ఏమయ్యాయని ప్రశ్నించారు. తెలంగాణలో ప్రభుత్వం మారాలని ప్రజలు కోరుకుంటున్నారని బండి అన్నారు. ఇప్పటివరకు జరిగిన పాదయాత్ర సభలన్నీ సక్సెస్‌ అని.. గురువారం కరీంనగర్‌లో జరిగే ఐదో విడత ప్రజా సంగ్రామయాత్ర ముగింపు సభ సక్సెస్‌ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా, ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Harishrao | తెలంగాణపై కేంద్రం ప్రశంసల వర్షం.. జాతీయ స్థాయిలో రెండు అవార్డులు దక్కించుకున్న రాష్ట్రం

BRS Party | ఢిల్లీలో బీఆర్‌ఎస్‌ ఆఫీసును ప్రారంభించిన కేసీఆర్‌.. హాజరైన అఖిలేష్‌ యాదవ్‌, కుమారస్వామి

KCR Inaugurate BRS party office | ఢిల్లీలో బీఆర్‌ఎస్‌ కార్యాలయాన్ని ప్రారంభించనున్న కేసీఆర్‌.. వాస్తుకు అనుగుణంగా జరుగుతున్న మార్పులు

Nitish kumar on BJP | వచ్చే ఎన్నికల్లో ఆయనే బిహార్ సీఎం అభ్యర్థి.. కేంద్రంలో బీజేపీని గద్దె దించడమే నా లక్ష్యం: నితీష్‌ కుమార్‌

Amit shah comments on congress | చైనా నుంచి కాంగ్రెస్ సంస్థకు డబ్బులు అందాయి.. కాంగ్రెస్ పార్టీపై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు..

Nirbhaya Fund | ఎమ్మెల్యేల రక్షణకు నిర్భయ వాహనాలు.. షిండే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

India-China troops clash | భారత్-చైనా సరిహద్దులో ఘర్షణపై రాజ్‌నాథ్ సింగ్ లోక్‌సభలో కీలక ప్రకటన..

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News