Home Latest News Minister KTR | బీజేపీ ఎమ్మెల్యేలకు మంత్రి కేటీఆర్‌ చురకలు..

Minister KTR | బీజేపీ ఎమ్మెల్యేలకు మంత్రి కేటీఆర్‌ చురకలు..

Minister KTR | తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో శనివారం ప్రసంగించిన మంత్రి కేటీఆర్‌.. బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్‌, రఘునందన్‌రావులకు చురకలు అంటించారు. రాష్ట్రంలో కరెంట్‌ కోతలు ఉన్నాయంటూ బీజేపీ చేస్తున్న రాద్ధాంతంపై స్పందించిన కేటీఆర్‌ కౌంటర్‌ వేశారు.

రాష్ట్రంలో 24 గంటల కరెంట్‌ ఇస్తే ముక్కు నేలకు రాస్తానని ఈటల రాజేందర్‌ చేసిన వ్యాఖ్యలపై ముందుగా మంత్రి కేటీఆర్‌ స్పందించారు. ఇక్కడ (బీఆర్‌ఎస్‌) ఉన్నప్పుడు మంచిగ ఉండె.. అక్కడికి పోయినంక ఎటో ఎటో అయ్యిండు అంటూ ఎద్దేవా చేశారు. ఆడికి పోంగనే మనుషులు మారిపోతారని విమర్శించారు.

కరెంట్‌ వస్తనే లేదు.. కరెంట్‌ వస్తనే లేదు అని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ లొల్లి చేస్తుంటడు. ఆయనకు మా టాన్స్‌పోర్టు మంత్రి మంచి సమాధానం చెప్పిండు. కరెంట్‌ వస్తలేదు అంటున్నవ్‌ కదా.. రాష్ట్రంలో ఏడికి అయిన పోయ్యి కరెంట్‌ తీగలు పట్టుకో.. రాష్ట్రంలో కరెంట్‌ వస్తుందా లేదా అనేది బరాబర్‌ తేలిపోతది.. అని మా మంత్రి మంచి సమాధానం చెప్పిండు.

కానీ నేను ఆ మాట అనట్లేదు. పొరపాటున కూడా అన. మీ ఇద్దరు ఉండాలె. అసలె ఇద్దరు ఉన్నరు. మీ ఇద్దరు మంచిగ ఉండాలని కోరుకుంటున్న అంటూ ఇన్‌డైరెక్ట్‌గా చురకలు అంటించారు కేటీఆర్‌.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

KTR with Eetela | మీరేందుకు రాలేదు..? మీరు పిలిస్తేనే కదా వచ్చేది.. కేటీఆర్‌, ఈటల మధ్య ఆసక్తికరమైన సంభాషణ

Governor Tamilisai | దేశానికే ఆదర్శంగా తెలంగాణ.. కేసీఆర్ సర్కారుపై గవర్నర్ తమిళిసై ప్రశంసల వర్షం

Ponguleti Srinivas Reddy | వైఎస్సార్‌టీపీలోకి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ? స్పష్టత ఇచ్చిన వైఎస్ షర్మిల

K.Viswanath | కళాతపస్వి మరణానికి కొద్ది క్షణాల ముందు జరిగింది ఇదే.. పాట రాయడం మొదలుపెట్టిన కాసేపటికే..

K.Viswanath | చిరంజీవి, కమల్‌ హాసన్‌కు కళాతపస్వి కె.విశ్వనాథ్ అంటే ఎందుకంత అభిమానం?

Exit mobile version