Land Regularization | అనుమతి లేకుండా ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని నివాసం ఏర్పరచుకున్న పేదలకు తెలంగాణ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఆయా స్థలాలపై వారికి హక్కులు కల్పించేందుకు వీలుగా భూముల క్రమబద్ధీకరణకు మరో అవకాశం ఇచ్చింది. ఆయా భూములపై హక్కులు పొందేందుకు మరోసారి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయిచింది. అంతేకాదు క్రమబద్దీకరణ గడువును కూడా పొడిగించింది. గతంలో 2014 జూన్ 2వ తేదీ వరకు కటాఫ్ తేదీ నిర్ణయించగా.. తాజాగా 2020 జూన్ 2 వరకు పెంచింది. ఈ మేరకు జీవో 28, 29ని జారీ చేసింది.
ప్రభుత్వ భూముల్లో అనుమతి లేకుండా ఇల్లు నిర్మించుకున్న వారిపైకి ఆయా స్థలాలపై శాశ్వత హక్కులు కల్పించాలని 2014 డిసెంబర్లో సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు జీవో 58, 59ని విడుదల చేశారు. దీని ప్రకారం ఆక్రమణదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. పేదల నుంచి పెద్ద ఎత్తున వస్తున్న విజ్ఞప్తుల మేరకు తెలంగాన ప్రభుత్వం ఈ నిర్ణయం చేసుకుంది. ఈ జీవోల ప్రకారం దాదాపు 2 లక్షల మంది తమ స్థలాలను రెగ్యులరైజేషన్ చేసుకున్నారు. అయితే ఇంకా చాలాచోట్ల దరఖాస్తులు చేసుకోని వారు మిగిలిపోవడంతో భూముల క్రమబద్దీకరణకు అవకాశం ఇవ్వాలని పేదల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వచ్చాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం భూముల క్రమబద్దీకరణకు అవకాశం ఇచ్చింది.
ఈ జీవో ప్రకారం ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ గడువులోగా దగ్గరలోని మీసేవలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సింగరేణి సంస్థకు చెందిన భూముల్లో ఉండే వారికి మాత్రం మూడు నెలల అవకాశం ఇచ్చారు. 125 చదరపు గజాలలోపు స్థలాలను ఆక్రమించుకున్న వాళ్లకు ఉచితంగా భూములను రెగ్యులరైజ్ చేస్తారు. 250 గజాల్లోపు అయితే 50 శాతం, 250 నుంచి 500 గజాల్లోపు స్థలాలు అయితే మార్కెట్ ధరలో 75 శాతం ఫీజును వసూలు చేస్తారు. 500 గజాలు దాటితే మార్కెట్ ధర చెల్లించి క్రమబద్దీకరణ చేయించుకోవాల్సి ఉంటుంది. భూముల క్రమబద్దీకరణకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. కటాఫ్ తేదీ ముందు నుంచి ఆ స్థలంలో ఉంటున్నట్లు నిరూపించుకోవాల్సి ఉంటుంది.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Pawan Kalyan | రోజుకు 2 కోట్లు.. వైరల్గా మారిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్
Junior NTR | ఎంత పని చేశావు తారక్.. ఫ్యాన్ వార్ కు పెట్రోల్ పోసాడుగా..!
Oscars 2023 | ఆస్కార్ అవార్డు పోగొట్టుకుంటే ఎలా? అప్పుడు అకాడమీ ఏం చేస్తుంది?
Silicon Valley Bank | 100 రూపాయలకే సిలికాన్ వ్యాలీ బ్యాంకు యూకే యూనిట్ దక్కించుకున్న హెచ్ఎస్బీసీ