KCR Inaugurate BRS party office | ఢిల్లీలో భారత రాష్ట్ర సమితి ( BRS ) కార్యాలయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ( CM KCR ) బుధవారం ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ఇప్పటికే సతీసమేతంగా కేసీఆర్ ఢిల్లీ చేరుకున్నారు. బీఆర్ఎస్ కార్యాలయం దగ్గర నిర్వహించే రాజశ్యామల యాగంలో కేసీఆర్ దంపతులు పాల్గొంటారు.
బీఆర్ఎస్ కార్యాలయానికి సంబంధించిన పనులను రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఎంపీ సంతోష్కుమార్ ఆది, సోమవారాల్లో పరిశీలించారు. వాస్తు శిల్పి సుద్దాల సుధాకర్ సూచనలకు అనుగుణంగా కార్యాలయంలో మార్పులు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రారంభోత్సవానికి వివిధ రాష్ట్రాల నుంచి పలువురు నేతలు హాజరవుతారని సమాచారం. ఇప్పటికే ఢిల్లీలో పలు ప్రాంతాల్లో బీఆర్ఎస్కు సంబంధించిన హోర్డింగ్లు ఏర్పాటు చేశారు. కేసీఆర్ ఫర్ ఇండియా, అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ వంటి నినాదాలతో వీటిని ఏర్పాటు చేశారు.
తెలంగాణ నుంచి కూడా ప్రజా ప్రతినిధులు, కార్పొరేషన్ల చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రతినిధులు కూడా ఢిల్లీ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
Read More Articles |
Cyber Crime | 3 కోట్లకు కిడ్నీ అమ్మకానికి పెట్టి.. 16 లక్షలు పోగొట్టుకుంది..మోసపోయిన ఏపీ యువతి
Instagram | ఇన్స్టాగ్రామ్లో అసభ్యకర మెసేజ్లు వస్తున్నాయా? వాటిని ఇలా ఆపేయండి
Money Plant | మనీ ప్లాంట్ను ఏ దిక్కున పెంచాలి? ఇది ఎండిపోతే ఏమవుతుంది