Bandi Sanjay | తెలంగాణ సచివాలయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సచివాలయం భారతీయ సంస్కృతికి అనుగుణంగా లేదని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ సర్కార్ వస్తే కొత్త సచివాలంయ డూమ్లు కూల్చేస్తామని సంచలన ప్రకటన చేశారు. సచివాలయంలో మళ్లీ మార్పులు చేస్తామని తెలిపారు. రోడ్డు పక్క మందిరాలు, మసీదులు కూలుస్తామంటున్నారు.. దమ్ముంటే పాతబస్తీ నుంచి కూల్చివేతలు మొదలు పెట్టాలని సవాలు విసిరారు. అసద్ కళ్లలో ఆనందం కోసమే తాజ్మహల్ నమూనాలో సచివాలయాన్ని నిర్మించారని పేర్కొన్నారు.
ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సచివాలయం డూమ్లు కూల్చేస్తామని ప్రకటిస్తే.. మొన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రగతిభవన్ను కూల్చేయాలని పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమారం రేపుతున్నాయి. వీటిపై బీఆర్ఎస్ నేతలు విముర్శలు గుప్పిస్తున్నారు. పలువురు కాంగ్రెస్ నేతలు కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. ఇలాంటి సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సచివాలయం డూమ్లు కూల్చేస్తామని అనడం వైరల్గా మారింది.
Follow Us : Google News, Facebook, Twitter