Home Latest News Bandi Sanjay | సచివాలయం డోమ్‌లు కూల్చేస్తాం.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన...

Bandi Sanjay | సచివాలయం డోమ్‌లు కూల్చేస్తాం.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay | తెలంగాణ సచివాలయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సచివాలయం భారతీయ సంస్కృతికి అనుగుణంగా లేదని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ సర్కార్ వస్తే కొత్త సచివాలంయ డూమ్‌లు కూల్చేస్తామని సంచలన ప్రకటన చేశారు. సచివాలయంలో మళ్లీ మార్పులు చేస్తామని తెలిపారు. రోడ్డు పక్క మందిరాలు, మసీదులు కూలుస్తామంటున్నారు.. దమ్ముంటే పాతబస్తీ నుంచి కూల్చివేతలు మొదలు పెట్టాలని సవాలు విసిరారు. అసద్ కళ్లలో ఆనందం కోసమే తాజ్‌మహల్ నమూనాలో సచివాలయాన్ని నిర్మించారని పేర్కొన్నారు.

ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సచివాలయం డూమ్‌లు కూల్చేస్తామని ప్రకటిస్తే.. మొన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రగతిభవన్‌ను కూల్చేయాలని పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమారం రేపుతున్నాయి. వీటిపై బీఆర్ఎస్ నేతలు విముర్శలు గుప్పిస్తున్నారు. పలువురు కాంగ్రెస్ నేతలు కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. ఇలాంటి సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సచివాలయం డూమ్‌లు కూల్చేస్తామని అనడం వైరల్‌గా మారింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

TSRTC | పెళ్లిళ్ల సీజన్‌లో టీఎస్ ఆర్టీసీ అదిరిపోయే ఆఫర్‌!

Cow Hug Day | లవర్స్‌కి అలర్ట్‌.. భారత్‌లో ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు కాదట.. కౌ హగ్‌ డేనట.. అందరూ ఇలా చేయాలన్న పశుసంవర్ధక శాఖ!

Narendra Modi | దేశం కోసమే నా జీవితం అంకితం చేశా.. కాంగ్రెస్‌ వల్ల దశాబ్ద కాలాన్ని కోల్పోయాం.. కాంగ్రెస్‌పై మోదీ ఫైర్‌!

Transgender Pregnant | పండంటి బిడ్డకు జన్మినిచ్చిన అబ్బాయి.. సోషల్‌ మీడియా ద్వారా ఆనందాన్ని పంచుకున్న అతని భార్య

Exit mobile version