LTTE Chief Prabhakaran | ఎల్టీటీఈ చీఫ్ టైగర్ ప్రభాకరన్ ఇంకా బతికే ఉన్నారంటూ తమిళ దేశీయ వాదం అధ్యక్షుడు పళు నెడుమారన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చనిపోతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని.. త్వరలోనే ఆయన ప్రజల ముందుకు వస్తారని తెలిపారు. ఇప్పటికీ ప్రభాకరన్.. తన కుటుంబసభ్యులతో మాట్లాడుతున్నారని చెప్పారు. తాను బతికి ఉన్నట్లు ప్రజలకు చెప్పాలని స్వయంగా ప్రభాకరన్ తనతో అన్నారని.. అందుకే ఇప్పుడు మీడియా ముందుకొచ్చినట్లు స్పష్టం చేశారు.
2009లో ముల్లైతీవు ప్రాంతంలో శ్రీలంక ఆర్మీ, ఎల్టీటీఈ మధ్య జరిగిన పోరులో ప్రభాకరన్ మరణించారని అప్పట్లో ప్రకటించారు. ఆ తర్వాత కొంతకాలానికి ప్రభాకరన్ కుమారుడు చార్లెస్ ఆంటోనీ కూడా శ్రీలంక సైన్యంతో జరిగిన పోరులో మరణించారు. ఆయన మృతదేహం ఫొటోలను కూడా శ్రీలంక సైన్యం విడుదల చేసింది. కానీ దాదాపు 14 ఏళ్ల తర్వాత ప్రభాకరన్ బతికే ఉన్నారంటూ నెడుమారన్ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.
తంజావూరులో శుక్రవారం మీడియాతో మాట్లాడిన నెడుమారన్.. ప్రభాకరన్ సజీవంగానే ఉన్నారు. ఆరోగ్యంగా ఉన్నారు. తమిళ ఈలమ్ ప్రజల కోసం ప్రకటనలు చేయనున్నారు. ఈ విషయాన్ని చెబుతున్నందుకు సంతోషంగా ఉందని ప్రకటించారు. అయితే ప్రభాకరన్ ఎక్కడ ఉన్న విషయాన్ని మాత్రం నెడుమారన్ బయటపెట్టలేదు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
bachelors | అందమైన అమ్మాయి దొరకాలని పెళ్లి కాని ప్రసాదుల పాద యాత్ర.. వీళ్లకు పిల్ల దొరికేనా !!
Jagapathi babu | ఏమైందో తెలియదు.. పోగొట్టుకున్నా ఆస్తులపై నోరువిప్పిన జగపతిబాబు..
Minister KTR | మెట్రో టికెట్ ధరలు ఇష్టం వచ్చినట్టు పెంచితే ఊరుకోం.. అసెంబ్లీ సాక్షిగా మంత్రి కేటీఆర్ హెచ్చరిక