Andhra Pradesh | రాజకీయ పార్టీల రోడ్ షోలు, రహదారుల మీద సభలపై ఏపీ ప్రభుత్వం ఆంక్షలు విధిస్తూ తీసుకొచ్చిన జీవో నెంబర్ 1పై విచారణ ముగిస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. జీవో నెంబర్ 1ను ఇటీవలే ఏపీ హైకోర్టు సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
దీనిపై సీజేఐ జస్టిస్ డీవై చంద్రచుడ్, పీఎస్ నరసింహతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ప్రస్తుత పరిస్థితుల్లో జీవో నంబర్ 1 పై జోక్యం చేసుకోలేమని తెలిపింది. ఏపీ హైకోర్టు సీజీ ధర్మాసనం దీనిపై విచారణ చేపడుతుందని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. నెల 23న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని డివిజన్ బెంచ్ విచారణ చేపట్టాలని సీజేఐ సూచించారు. వాద, ప్రతివాదులిద్దరూ డివిజన్ బెంచ్ ముందు అన్ని అంశాలను ప్రస్తావించుకోవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల పాల్గొన్న కందుకూరు, గుంటూరు సభల్లో తొక్కిసలాటల్లో 11 మంది మరణించారు. దీంతో ఇరుకైన గల్లీలు, రహదారులపై సభలు నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 1ని తీసుకొచ్చింది. అయితే ఈ జీవోను రద్దు చేసే వరకూ తాము పోరాటం చేస్తామని చంద్రబాబు, పవన్ ప్రకటించారు.
ఈ జీవోను రద్దు చేయాలంటూ ఏపీ హైకోర్టులో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ పిల్ దాఖలు చేశారు. రాష్ట్రంలో రహదారులపై సమావేశాలు నిర్వహించకుండా ప్రభుత్వం రాజకీయ పార్టీల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు జీవో నంబర్ 1ను సస్పెండ్ చేస్తూ తీర్పు ఇచ్చింది.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Priya Bhavani Shankar | డబ్బు కోసమే సినిమాలు చేస్తున్నా.. అయితే ఏంటి.. మీడియాపై హీరోయిన్ విసుర్లు
Rashmika Mandanna | డైరెక్టర్ దెబ్బకు దిగొచ్చిన రష్మిక.. వాళ్ల వల్లే ఇక్కడ ఉన్నానంటూ పొగడ్తలు
Jabardasth | జబర్దస్త్ నటుడు రాకింగ్ రాకేశ్ – జోర్దార్ సుజాత పెళ్లి ఫిక్స్.. ఈ నెలలోనే ఎంగేజ్మెంట్
Quelea Birds | బుల్లి పిట్టలపై కెన్యా యుద్ధం.. ఆరు లక్షల పక్షులను చంపడమే టార్గెట్