Supreme Court | సహజీవనం చేసే జంట రిజిస్టర్ చేసుకునేలా రూపకల్పనలు జరగాలంటూ సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ దాఖలు అయ్యింది. ఈ పిటిషన్ పై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ లివ్ ఇన్ రిలేషన్ మ్యాటర్ గురించి రిజిస్టర్ చేసేలా కేంద్రం నిబంధనలు రూపొందించాలంటూ చేసిన అభ్యర్థనలను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది.
అలా నిబంధనలు రూపొందించడం అంటే అంత కంటే తెలివి తక్కువ ఆలోచన ఇంకొకటి ఉండదని సుప్రీం కోర్టు పిటిషన్ దారుల పై మండిపడింది. కొంత కాలం క్రితం కాల్ సెంటర్ ఉద్యోగి శ్రద్ధావాకర్ను తన సహజీవన భాగస్వామి ఆఫ్తాబ్ పూనావాలా అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాణి అనే మహిళ సుప్రీంకోర్టు లో ఓ పిల్ దాఖలు చేశారు.
సహజీవన సంబంధాల్లో అత్యాచారాలు, హత్యల వంటి నేరాలు రోజురోజుకి పెరుగుతున్నాయని ఆమె పిటిషన్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అలాంటి బంధాలను రిజిస్ట్రేషన్ చేసేందుకు నిబంధనలు రూపొందించేలా కేంద్రానికి ఆదేశాలివ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. ఇలా రిజిస్ట్రేషన్ చేయడం వల్ల సహజీవనంలో ఉండే వ్యక్తుల పూర్తి సమాచారం ప్రభుత్వం వద్ద ఉంటాయని.. అత్యాచార కేసులు కూడా తగ్గుతాయని ఆమె పిటిషన్లో పేర్కొన్నారు.
ఈ పిటిషన్పై సోమవారం విచారణ జరిపిన సీజేఐ జస్టిస్ డి.వై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.. పిటిషన్దారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్తో సహజీవనం చేసేవారికి భద్రత కల్పించాలని చూస్తున్నారా? లేదా అలాంటి బంధంలోకి ఎవరూ వెళ్లొద్దని కోరుకుంటున్నారా? అని కోర్టు ప్రశ్నించింది. ‘సహజీవన బంధాలను నమోదు చేసుకుని కేంద్రం ఏం చేసుకుంటుంది? ఇది ఎంతటి తెలివి తక్కువ ఆలోచన? ఇలాంటి ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసి కోర్టు సమయాన్ని వృథా చేస్తే జరిమానా విధించాల్సి ఉంటుంది. ఈ పిటిషన్ను మేం కొట్టేస్తున్నాం’అని ధర్మాసం స్పష్టం చేసింది.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Eyes Twitching | కన్ను కొట్టుకుంటే ఏం జరుగుతుంది..ఎవరికి ఏ కన్ను అదిరితే మంచిది!
Variety Railway Station | ప్రయాణం చేయకపోయిన టికెట్లు కొంటాం అంటున్న దయాల్పుర్ గ్రామస్థులు!
Do You Know | రైలు చివరి బోగి మీద X ఎందుకు రాస్తారో తెలుసా?
Raavi Chettu | రావి చెట్టు నీడ ఇంటి మీద పడితే అంత ప్రమాదామా?