TSPSC | టీఎస్పీఎస్సీ కార్యాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేవైఎం, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు, టీజేఎస్ కార్యకర్తలు టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. టీఎస్పీఎస్సీ బోర్డును ధ్వంసం చేశారు. భారీగా పోలీసులు మోహరించి ఆందోళనలను అదుపు చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, ఆందోళన కారుల మధ్య వాగ్వాదం జరిగింది. మరోవైపు టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ల లీక్ వ్యవహారంలో సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని బీజేవైఎం డిమాండ్ చేసింది.
మరోవైపు వివిధ విద్యార్థి సంఘాలు రాజ్భవన్ ను ముట్టడించాయి. యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లు కు గవర్నర్ తమిళిసై వెంటనే ఆమోదం తెలపాలంటూ బీఆర్ఎస్వీ, ఇతర విద్యార్థి సంఘాల నేతలు రాజ్ భవన్ ముందు బైఠాయించారు. గవర్నర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అప్రమత్తమైన పోలీసులు పలువురు విద్యార్థి నాయకులను అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.
ఈ బిల్లును గవర్నర్ పెండింగ్లో పెట్టడం వల్ల సుమారు 3 వేల ప్రొఫెసర్ పోస్టులు పెండింగ్లో ఉన్నాయన్నారు. పెండింగ్ బిల్లులను గవర్నర్ వెంటనే ఆమోదించాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Telangana Cabinet | సొంత స్థలం ఉన్న వాళ్లకు రూ.3లక్షల సాయం.. కొత్త పథకం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Telangana Cabinet | రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. కేబినెట్ నిర్ణయాలు ఇవే..
Influenza | కాన్పూర్లో విపరీతంగా పెరుగుతున్న ఇన్ ఫ్లూ ఎంజా కేసులు.. ఎమర్జెన్సీ వార్డులు ఫుల్!