Home Latest News Uddhav Thackeray | ఆనాడు థాక్రే కాపాడకపోతే.. మోదీ ఇప్పుడు ఎక్కడ ఉండేవారు.. ప్రధానిపై ఉద్ధవ్...

Uddhav Thackeray | ఆనాడు థాక్రే కాపాడకపోతే.. మోదీ ఇప్పుడు ఎక్కడ ఉండేవారు.. ప్రధానిపై ఉద్ధవ్ ఫైర్

Uddhav Thackeray | ప్రధాని నరేంద్ర మోదీపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే సీరియస్ అయ్యారు. శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే కాపాడకపోయి ఉంటే.. మోదీ ఇప్పుడు ఎక్కడ ఉండేవాడంటూ ప్రశ్నించారు. 2002లో గుజరాత్ అల్లర్ల తర్వాత అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి రాజధర్మం పాటించి రాజీనామా చేయాలని మోదీకి సూచించిన విషయాన్ని ఉద్ధవ్ థాక్రే గుర్తు చేశారు. ఆ రోజు బాల్ థాక్రే జోక్యం చేసుకుని వాజ్‌పేయికి నచ్చజెప్పకపోతే మోదీ ఇప్పుడు ఈ స్థాయిలో ఉండేవాడు కాదని తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీతో తెగిన సంబంధాల గురించి కూడా ఉద్ధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

మేం బీజేపీతో బంధాన్ని తెంచుకున్నాం తప్ప.. హిందూత్వతో కాదని ఉద్దవ్ థాక్రే స్పష్టం చేశారు. బీజేపీ అనుసరించేది హిందూత్వ కాదని ఆయన విమర్శించారు. హిందూత్వ అంటే బీజేపీ నుంచి నార్త్ ఇండియన్స్ సమాధానం కోరుతున్నారని తెలిపారు. హిందూత్వ అసలు అర్థం ఒకరినొకరు ద్వేషించుకోవడం కాదని స్పష్టం చేశారు. హిందువుల మధ్య చీలికలు తెచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. భారత దేశాన్ని ద్వేషించేవారికే బాలా సాహెబ్ వ్యతిరేకమని స్పష్టం చేశారు.

బీజేపీతో తమ పార్టీకి 25 నుంచి 30 ఏళ్ల అనుబంధం ఉందని.. కానీ ఇప్పుడు వాళ్లు తమను వద్దనుకున్నారని ఉద్ధవ్ థాక్రే తెలిపారు. తమ మర్యాదను కాపాడుకునేందుకే బీజేపీ నుంచి బయటకు వచ్చేశామని అన్నారు. అలా బయటకు రాకపోయి ఉంటే ఇప్పుడు కొందరు ఎదుర్కొంటున్న బానిసత్వాన్ని కూడా ఎదుర్కోవాల్సి వచ్చేదని పేర్కొన్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

KCR on Etela Rajender | ఈటల తిరిగి బీఆర్‌ఎస్‌లో చేరతారా.. అసెంబ్లీలో కేసీఆర్‌ ఏమన్నారు.. ఈటల రియాక్షన్‌ ఏంటి?

bachelors | అందమైన అమ్మాయి దొరకాలని పెళ్లి కాని ప్రసాదుల పాద యాత్ర.. వీళ్లకు పిల్ల దొరికేనా !!

Jagapathi babu | ఏమైందో తెలియదు.. పోగొట్టుకున్నా ఆస్తులపై నోరువిప్పిన జగపతిబాబు..

Turkey earthquake | తుర్కియే భూకంపాన్ని అంచనా వేసిన శాస్త్రవేత్త హెచ్చరిక.. త్వరలో భారత్‌కు కూడా ముప్పే

Tarakarathna | తారకరత్నను విదేశాలకు తీసుకెళ్తున్నారా? నందమూరి కుటుంబసభ్యులు ఇచ్చిన హెల్త్ అప్‌డేట్ ఇదీ

Minister KTR | మెట్రో టికెట్ ధరలు ఇష్టం వచ్చినట్టు పెంచితే ఊరుకోం.. అసెంబ్లీ సాక్షిగా మంత్రి కేటీఆర్ హెచ్చరిక

Exit mobile version