Cherial Zptc | దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన సిద్దిపేట జిల్లా చేర్యాల జడ్పీటీసీ శెట్టె మల్లేశం మృతిచెందాడు. సికింద్రాబాద్లోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మల్లేశం మరణించినట్టుగా వైద్యులు తెలిపారు.
చేర్యాల మండలం గుర్జకుంటలో సోమవారం ఉదయం వాకింగ్కు వెళ్లిన మల్లేశాన్ని కొందరు దుండగులు అడ్డగించారు. కత్తులు, గొడ్డళ్లతో దాడి చేశారు. దీంతో తలకు తీవ్రగాయాలు కావడంతో మల్లేశం అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు రక్తపు మడుగులో పడివున్న మల్లేశాన్ని సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ తరలించాలని అక్కడి వైద్యులు సూచించారు. దీంతో హైదరాబాద్లోని యశోద ఆస్పత్రికి తరలించగా.. అక్కడే చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read More Articles |
Cordyceps | భారత్లోకి చైనా సైన్యం చొరబడేది ఆ బంగారం కోసమేనట.. తాజా నివేదికలో సంచలన విషయాలు
kalpika ganesh | వాళ్లందరి బండారం బయటపెడతా.. కల్పిక గణేశ్ వార్నింగ్