SI, Constable Mains | టైం2న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. ప్రస్తుతం ప్రిలిమ్స్లో అర్హత సాధించిన వారికి ఫిజికల్ ఈవెంట్స్ కొనసాగుతుండగా.. తాజాగా మెయిన్స్ ఎగ్జామ్స్ పరీక్షల తేదీలను పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ఖరారు చేసింది.
మార్చి 12 నుంచి మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పోలీసు నియామక మండలి తెలిపింది. ఏప్రిల్ 9న సివిల్ ఎస్సై పరీక్షలు, ఏప్రిల్ 23న అన్ని కానిస్టేబుల్ పోస్టులకు మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు పేపర్-2 పరీక్ష జరగనుంది.
కాగా, రాష్ట్ర వ్యాప్తంగా 11 కేంద్రాల్లో ఫిజికల్ ఈవెంట్స్ కొనసాగుతున్నాయి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, నల్లగొండ, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్లోని కేంద్రాల్లో ఫిజికల్ ఈవెంట్స్ కొనసాగుతున్నాయి. ఈ నెల 5న ఫిజికల్ ఈవెంట్స్ పరీక్షలు ముగుస్తాయి. ఈ ఫిజికల్ ఈవెంట్స్ నుంచి గర్భిణులకు మినహాయింపు ఇచ్చారు. హాల్ టికెట్లు ఎప్పటి నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చనే విషయం త్వరలో వెల్లడిస్తామని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వెల్లడించింది.
Read More Articles |
Viral | అక్కడ గాలిపటాలు ఎగిరేసినా బట్టలు బయట ఎండేసినా నేరమే.. అలా చేస్తే జైల్లో ఉండాల్సిందేనట!
Jobs Notification | తెలంగాణలో 1,365 పోస్టులతో గ్రూప్-3 నోటిఫికేషన్ విడుదల..