Viral News | ఆడపిల్ల పెళ్లి అనగానే తల్లిదండ్రులు పెద్ద ఎత్తున కట్నం ఇస్తుంటారు. ఘనంగా కూతురి పెళ్లి చేస్తుంటారు. కానీ రాజస్థాన్లో మాత్రం మేనమామలు భారీగా కట్నం ఇచ్చి మేనకోడలి పెళ్లి చేశారు. భారీగా అంటే ఎన్ని లక్షలు అయ్యి ఉండొచ్చని ఆలోచిస్తున్నారా? లక్షలు కాదండీ.. కోట్లు.. కోట్ల రూపాయల నగదు, భూమి, బంగారం ఇచ్చి మరీ పెళ్లి చేశారు. దీంతో ఈ విషయం ఇప్పుడు వైరల్గా మారింది. అసలు మేనమామలు అంత డబ్బు ఇచ్చి మేనకోడలి పెళ్లి ఎందుకు చేశారో ఇప్పుడు తెలుసుకుందాం..
రాజస్థాన్లోని నాగౌర్ జిల్లా బుర్డీ గ్రామానికి చెందిన భన్వర్లాల్ గర్వాకు ముగ్గురు కొడుకులు హరేంద్ర, రామేశ్వర్, రాజేంద్ర. ఓ కూతురు. ముగ్గురు కొడుకులు బాగా సంపాదించారు. రెండు వేల ఎకరాలకు పైగా భూమిని కలిగి ఉన్న వీరు చెల్లి పెళ్లి ఘనంగా చేశారు. ఆమెకు పెళ్లీడుకు వచ్చిన కూతురు ఉంది. ఈ మధ్యనే తమ మేనకోడలి పెళ్లి నిశ్చయమైంది. దీంతో ఈ ముగ్గురు మేనమామలు మేనకోడలి పెళ్లిని ఘనంగా జరిపించడమే కాకుండా ఎవరూ ఊహించనంత కట్నాన్ని సమర్పించుకున్నారు. 3.21 కోట్ల రూపాయలను నగదును, పది ఎకరాల వ్యవసాయ భూమిని, 30 లక్షల రూపాయలు విలువ చేసే ఒక ప్లాటును, 41 తులాల బంగారాన్ని, ఓ మూడు కిలోల వెండి, ఓ ట్రాక్టర్ను కానుకగా ఇచ్చారు. మేనకోడలికి ఓ స్కూటీని బహుమతిగా ఇచ్చారు. అంతేనా పెళ్లికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఓ వెండి నాణాన్ని రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చారు.
బుర్డీ గ్రామ ప్రజలు మైరా సంప్రదాయాన్ని అనుసరిస్తారు. ఈ సంప్రదాయం ప్రకారం మేనకోడలికి మేనమామలే కట్న కానుకలు ఇవ్వాల్సి ఉంటుంది. మేనకోడలికే కాదు మేనల్లుడు పెళ్లి ఖర్చులు కూడా మేనమామలే భరించాల్సి ఉంటుందట. అయితే ఇప్పటివరకు ఈ గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున ఎవరూ కట్నకానుకలు ఇవ్వకపోవడంతో ఈ విషయం ఇప్పుడు వైరల్గా మారింది.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Allu Arjun | అల్లు అర్జున్ ట్విట్టర్లో నన్ను బ్లాక్ చేశాడు.. వైరల్గా మారిన వరుడు హీరోయిన్ ట్వీట్
Viral News | డంప్ యార్డులో అగ్ని ప్రమాదం.. రూ.100 కోట్ల ఫైన్ వేసిన ఎన్జీటీ
Naveen Murder Case | నవీన్ మర్డర్ కేసులో కీలక మలుపు.. జైలు నుంచి నిహారిక విడుదల