Bandi Sanjay | బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. తెలంగాణలో చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రను చూసి ఇతర నేతలు నేర్చుకోవాలంటూ ప్రధాని పొగడ్తలతో ముంచెత్తారు. అంతే కాకుండా బండిని చూస్తుంటే మరో వెంకయ్య నాయుడు గుర్తుకు వస్తున్నారని కితాబు కూడా ఇచ్చారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం ప్రజా సంగ్రామ యాత్రను ప్రస్తావించి బండిని ప్రత్యేకంగా అభినందించారు.
ఢిల్లీలో బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో ఈ మేరకు ప్రశంసలు కురిపించారు. తెలంగాణలో పార్టీ పని తీరు, ప్రజా సంగ్రామ యాత్ర పై సంజయ్ నివేదిక సమర్పించారు. ఈ సందర్భంగా మోదీ ప్రసంగిస్తూ సంజయ్ ని చూస్తే వెంకయ్య నాయుడు గుర్తుకు వస్తారు.. ఆయనలాగానే బండి కూడా అద్భుతంగా మాట్లాడుతారు.. పార్టీని ముందుకు తీసుకుని వెళ్లడానికి ఎంతగానో కృషి చేస్తున్నారంటూ మోదీ ప్రశంసించారు.
ఈ సందర్భంగా ప్రజా సంగ్రామ యాత్ర ఏ విధంగా కొనసాగింది అనేది చెప్పాలని మోదీ సంజయ్ని కోరారు. దాంతో బండి కాసేపు హిందీలో మాట్లాడిన తరువాత నేను పూర్తి స్థాయిలో చెప్పలేకపోతున్నాని తెలిపారు. ఇంతలో కల్పించుకున్న మోదీ భావోద్వేగాలతో కూడిన అంశాన్ని మాతృభాషలోనే చెప్పాలని.. తెలుగులో మాట్లాడాలని సూచించారు.
దీంతో ప్రజా సమస్యలపై పోరు, పార్టీని ప్రజల్లోకి తీసుకుని వెళ్లడమే లక్ష్యంగా ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టామని బండి చెప్పారు. చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయంతో పాటు వివిధ ప్రాంతాల్లో చేపట్టిన కార్యక్రమాలు, యాత్ర సాగిన తీరును వివరించడంతో కార్యవర్గ సభ్యులంతా కరతాళధ్వనులు చేశారు. అనంతరం మరోసారి ప్రధాని మాట్లాడుతూ రాష్ట్రంలో పార్టీ అభివృద్ధికి సంజయ్ ఎంతగానో పాటుపడుతున్నారని కితాబిచ్చారు.
యాత్ర చేసిన సంజయ్ తన గురించి తాను గొప్పగా చెప్పుకోలేరని, యాత్రలో పాల్గొన్న తెలంగాణ బీజేపీ ఇన్ ఛార్జి హిందీలో వివరించాలని కోరారు. దీంతో సంజయ్ తెలుగులో మాట్లాడిన అంశాన్ని తరుణ్ ఛుగ్ హిందీలో అనువదించడంతో పాటు యాత్రలో చోటుచేసుకున్న వివిధ ఘట్టాలను వివరించారు.
అనంతరం మరోసారి ప్రధాని మాట్లాడుతూ బండి సంజయ్ యాత్ర చేపట్టిన మార్గాల్లోకి ఇతర రాష్ట్రాల నేతలు వెళ్లి యాత్ర సాగిన తీరుపై అధ్యయనం చేయాలని సూచించారు. భవిష్యత్ లో సంజయ్ చేపట్టే యాత్రకు ఇతర రాష్ట్రాల నుంచి యువ మోర్చా నేతలను పంపిస్తే మార్గదర్శకంగా ఉంటుందంటూ మోదీ సంజయ్ భుజం తట్టి అభినందించారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Pallavi Joshi | కశ్మీర్ ఫైల్స్ నటికి యాక్సిడెంట్.. గాయాలతోనే షూటింగ్లో పాల్గొన్న పల్లవి జోషి
vijay antony | మలేసియాలో షూటింగ్ స్పాట్లో తీవ్రంగా గాయపడ్డ బిచ్చగాడు హీరో
Hyderabad tragedy | పండుగపూట హైదరాబాద్లో విషాదం.. భార్యాపిల్లలను, తల్లిని చంపి వ్యక్తి బలవన్మరణం