Thursday, April 25, 2024
- Advertisment -
HomeLatest NewsSazia Marri | మా దగ్గర అణుబాంబులు ఉన్నాయని మరిచిపోవద్దు.. భారత్‌కు పాక్ వార్నింగ్

Sazia Marri | మా దగ్గర అణుబాంబులు ఉన్నాయని మరిచిపోవద్దు.. భారత్‌కు పాక్ వార్నింగ్

Pakistan Minister Sazia Marri | భారత్‌పై పాకిస్థాన్ మరోసారి అక్కసు వెళ్లగక్కింది. పాక్ మంత్రి బిలావల్ భుట్టో వివాదాస్పద వ్యాఖ్యలను మరువక ముందే.. మరో మంత్రి భారత్‌పై నోరుపారేసుకున్నారు. పాకిస్థాన్ అణుబాంబులు ఉన్నాయన్న విషయాన్ని భారత్ మరిచిపోవద్దని పాక్ మంత్రి షాజియా మారీ హెచ్చరించారు. తమ అణ్వాస్త్రాల హోదాను మౌనంగా ఉండేందుకు కాదని.. అవసరమైన వాటిని ఉపయోగించేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం యుద్ధానికి దిగితే ధీటుగా బదులిస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు పాకిస్థాన్ మీడియాలో వార్త ప్రచురితమైంది. ఈ వ్యాఖ్యలను సమర్థించుకుంటూ షాజియా మారీ ట్వీట్ కూడా చేశారు. పాక్ ఒక బాధ్యతాయుత అణు దేశమని పేర్కొన్నారు.

ఇటీవల పాక్ మంత్రి ఒకరు భారత్‌ను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్ ఇంటి ముందు గత ఏడాది జరిగిన బాంబు దాడి వెనుక భారత్ కుట్ర ఉందని పాక్ ఇటీవల ఒక పత్రాన్ని విడుదల చేసింది. ఉగ్రవాదాన్ని భారత్ కంటే గొప్పగా ఎవరూ ఉపయోగించుకోలేరంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో జరిగిన సమావేశంలో పాల్గొన్న భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ను మీడియా ప్రశ్నించింది. దీనికి బదులిచ్చిన జైశంకర్.. ఉగ్రవాదం ముప్పు ఎక్కడి నుంచి మొదలైందనే విషయం ప్రపంచం మరిచిపోలేదని గుర్తు చేశారు. పెరట్లో పాములు పెంచుతున్నప్పుడు అవి ఎదుటివారినే కాటేయాలని ఆశించకూడదని.. వాటిని పెంచిన వాళ్లను కూడా కాటేస్తాయని చురకలు అంటించారు.

జైశంకర్‌ వ్యాఖ్యలపై పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో అక్కసు వెల్లగక్కారు. ఒసామా బిన్ లాడెన్ చనిపోయాడు.. కానీ గుజరాత్ కసాయి ఇంకా బతికే ఉన్నాడని సంచలన ఆరోపణలు చేశారు. అతను భారత ప్రధాని అని నేను భారతదేశానికి చెప్పాలనుకుంటున్నానని వ్యాఖ్యానించాడు. మోదీ ప్రధాని అయ్యేదాకా తమ దేశంలోకి రాకుండా అతనిపై అమెరికా నిషేధం విధించిందని గుర్తు చేశారు. ఆర్ఎస్ఎస్ ప్రధాని, ఆర్ఎస్ఎస్ విదేశాంగ మంత్రి అంటూ మోదీ, జై శంకర్‌లను విమర్శించారు. వీటిపై దేశవ్యాప్తంగా దుమారం రేగింది. ఈ క్రమంలోనే మరో పాక్ మంత్రి.. భారత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

AP CM Jagan mohan reddy | 32 మంది ఎమ్మెల్యేలకు ఏపీ సీఎం జగన్‌ వార్నింగ్‌.. పద్దతి మార్చుకోకుంటే టికెట్‌ ఇచ్చేదే లేదు

Avatar2 Review | అవతార్ 2 రివ్యూ.. జేమ్స్ కామెరూన్ మరోసారి మాయ చేశాడా?

Macherla | రణరంగంగా మారిన మాచర్ల.. టీడీపీ, వైసీపీ శ్రేణుల వీరంగంతో హైటెన్షన్..

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News