Sabarimala Makara Jyothy | శబరిమలలో జ్యోతి దర్శనంతో లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు పులకించిపోయారు. స్వామియే శరణం అయ్యప్ప నామస్మరణలతో శబరిగిరులు ప్రతిధ్వనించాయి. శబరిమల ఆలయానికి ఈశాన్య దిశలో పర్యతాల నుంచి వెలుగులీనుతూ మకర జ్యతి దర్శనం ఇచ్చింది. దాదాపు 10 లక్షల మంది మకర జ్యోతి దర్శనం చేసుకున్నారు. శనివారం రాత్రి మకర జ్యోతి దర్శనమిచ్చింది.
సూర్యుడు మకర రాశిలోకి సంచారం చేయడం వల్ల ప్రజల జీవితాల్లో చాలా మార్పులు సంభవిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇదే క్రమంలో భక్తులు భారీగా అయ్యప్ప మాలలు వేసుకోవడం వల్ల అయ్యప్ప జ్యోతి రూపంలో దర్శనమిస్తారని భక్తుల నమ్మకం. ఏటా జనవరి 14న అయ్యప్ప మకరజ్యోతి కనిపిస్తుంది. కేరళలో దీనినే మకరవిళక్కు వార్షిక పండుగ అని అంటారు. మకర జ్యోతిని దర్శించుకోవడం వల్ల మంచి జరుగతుందని భక్తుల నమ్మకం. అందుకే మకరజ్యోతిని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు శబరిమలకు తరలివస్తారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
KL Rahul | ప్రేమించిన అమ్మాయితో ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న కేఎల్ రాహుల్
Prithvi Shaw | పృథ్వీ షాకు ప్రోత్సాహం సరే.. టీమిండియా జట్టులో చోటు మాటేంటి?