Nizamabad Bride | నిజామాబాద్ జిల్లా నవీపేటలో తీవ్ర విషాదం నెలకొంది. తెల్లారితే పెళ్లి పీటలు ఎక్కాల్సిన నవ వధువు ఉరివేసుకుని ఆత్మ హత్య చేసుకుంది. అప్పటివరకు మెహెందీ ఫంక్షన్లో ఆడిపడిన యువతి.. పెళ్లికూతురిగా ముస్తాబైన తర్వాత ప్రాణాలు తీసుకోవడం సంచలనంగా మారింది.
నిజామాబాద్ జిల్లా నవీపేటకు చెందిన ర్యాగల రవళి (26)కు నిజామాబాద్కు చెందిన ఓ యువకుడితో వివాహం నిశ్చయమైంది. ఆదివారం మధ్యాహ్నం 12.15 గంటలకు నిజామాబాద్లోని ఓ ఫంక్షన్ హాల్లో పెళ్లి జరగాల్సి ఉంది. ఈ క్రమంలో శనివారం సాయంత్రం మెహందీ ఫంక్షన్లో రవళి ఉత్సాహంగా పాల్గొంది. డ్యాన్స్లు చేస్తూ ఎంజాయ్ చేసింది. అనంతరం ఆమెను పెళ్లికూతురిగా ముస్తాబు చేశారు. తర్వాత కుటుంబసభ్యులు పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు.
ఏమైందో తెలియదు.. ఇంట్లోని స్టోర్ రూంలోకి వెళ్లిన రవళి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో పెళ్లింట తీవ్ర విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు రవళి మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తరలించారు. రవళి ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. అయితే రవళి శనివారం రాత్రి చివరగా తనకు కాబోయే భర్తతో ఫోన్ మాట్లాడింది. దీంతో కాబోయే భర్త వేధింపుల కారణంగానే రవళి ఆత్మహత్య చేసుకుందని ఆమె తండ్రి ఆరోపిస్తున్నారు. రవళి తండ్రి ప్రభాకర్ ఫిర్యాదు మేరకు పెళ్లి కొడుకుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనా కూతురికి కన్యాదానం చేసి అత్తవారింటికి పంపిద్దమని ఆశపడితే.. కాటికి పంపాల్సి రావడంతో ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.
Read More Articles |
Viral News | ఈగలు తెచ్చిన తంటా.. ఆ ఊరి పేరు చెబితేనే పిల్లను ఇవ్వట్లేదు
TSRTC Special Offer | అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. శబరిమలకు ఆర్టీసీ స్పెషల్ బస్సులు
FIFA World cup 2022 | చెదిరిన రొనాల్డో కల.. తొలిసారి సెమీస్కు చేరిన మొరాకో