Nitish kumar on BJP | కేంద్రంలో బీజేపీని గద్దె దించడమే తన లక్ష్యమని బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రకటించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఉమ్మడిగా పోరాడి గద్దె దించాల్సిన అవసరం ఉందన్నారు. బిహార్ లో జరిగే తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో తేజస్వీ యాదవ్ నేతృత్వంలో ముందుకెళతాని చెప్పారు. ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో తాను ఉండనని స్పష్టం చేశారు. బిహార్ లోని పాట్నాలో జరిగిన మహాఘటబంధన్ ఎమ్మెల్యేల సమావేశంలా నితీష్ ఈ వ్యాఖ్యలు చేశారు.
తనకు ప్రధాన మంత్రి పీఠం, ముఖ్యమంత్రి పీఠంపై ఆశలేదని అన్నారు. కేంద్రంలో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు కాషాయదళం ఇప్పటి నుంచే పావులు కదుపుతుందన్న ఆయన.. ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై బీజేపీని ఓడించాలన్నారు. ఇందుకోసం ప్రతిపక్ష పార్టీలన్నీ ఉమ్మడి కార్యాచరణ చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.
కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నంతవరకు నలంద యూనివర్సిటీ పునరుద్ధరణపై తనకు ఆశలేదని నితీష్ పేర్కొన్నారు. నలందలో అభివృద్ధి గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తేజస్వీ దాన్ని ముందుకు తీసుకెళతాడని అన్నారు.
Read More Articles |
Nirbhaya Fund | ఎమ్మెల్యేల రక్షణకు నిర్భయ వాహనాలు.. షిండే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
India-China troops clash | భారత్-చైనా సరిహద్దులో ఘర్షణపై రాజ్నాథ్ సింగ్ లోక్సభలో కీలక ప్రకటన..
Cyber Crime | 3 కోట్లకు కిడ్నీ అమ్మకానికి పెట్టి.. 16 లక్షలు పోగొట్టుకుంది..మోసపోయిన ఏపీ యువతి