Nepal plane crash | నేపాల్ విమాన ప్రమాదంలో ఇప్పటివరకు 42 మృతదేహాలను వెలికితీశారు. ఇందులో ఐదుగురు భారతీయులు మరణించినట్టు అనుమానిస్తున్నారు. ప్లేన్ క్రాష్ ఘట గురించి తెలియగానే నేపాల్ ప్రధాని హుటాహుటిన ఘటనాస్థలికి బయల్దేరి వచ్చారు. సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
నేపాల్ రాజధాని ఖాట్మాండు నుంచి బయల్దేరిన యేతి ఎయిర్లైన్ ఏటీఆర్-72 విమానం పొఖారా ఎయిర్పోర్టులో ల్యాండ్ అవుతుండగా క్రాష్ అయ్యింది. విమానం కుప్పకూలడంతో మంటలు చెలరేగాయి. దీంతో ఎయిర్పోర్టును మూసివేసిన అధికారులు.. హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో విమానంలో 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. శిథిలాల కింద మృతదేహాలను వెలికితీస్తున్నారు. ఇప్పటివరకు 42 మృతదేహాలను వెలికితీశారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. విమాన ప్రమాదం విషయం తెలియగానే నేపాల్ ప్రధాని ప్రచండ.. మంత్రివర్గంతో అత్యవసర సమావేశం అయ్యారు. అనంతరం ఖాట్మాండూ విమానాశ్రయానికి వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Telangana secretariat | సీఎం కేసీఆర్ బర్త్ డే నాడే తెలంగాణ సెక్రటేరియట్ ఓపెనింగ్.. మంత్రి వేముల వెల్లడి
Nepal plane crash | రన్ వేపై కుప్పకూలిన విమానం.. ప్లేన్లో 68 మంది ప్రయాణికులు
Ban on Gas stoves | చిన్న పిల్లల్లో పెరుగుతున్న అస్తమా.. గ్యాస్ స్టౌవ్ బ్యాన్ చేసే యోచనలో అమెరికా?