BRS Party | తెలంగాణ సీఎం కేసీఆర్ బుధవారం ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతీయ, రాష్ట్ర నాయకులు కేసీఆర్కు శుభాకాంక్షలు తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎస్పీ అధినేత, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, జేడీఎస్ అధినేత, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, తమిళనాడుకు చెందిన విడుతలై చిరుత్తైగల్ కచ్చి పార్టీ ఎంపీ చిదంబరం, పలు రాష్ట్రాల రైతు సంఘాల నేతలు, బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు పాల్గొన్నారు.
అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన రాజశ్యామల, నవచండీయగాలల్లో కేసీఆర్, ఆయన సతీమణి శోభ, ఎమ్మెల్సీ కవిత తో పాటు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ దంపతులకు వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని ఆశ్వీర్వదించారు.
Read More Articles |
Nirbhaya Fund | ఎమ్మెల్యేల రక్షణకు నిర్భయ వాహనాలు.. షిండే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
India-China troops clash | భారత్-చైనా సరిహద్దులో ఘర్షణపై రాజ్నాథ్ సింగ్ లోక్సభలో కీలక ప్రకటన..