Prahlad Modi | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్ అయింది. కర్ణాటకలోని మైసూరుకు 13 కిలోమీటర్ల దూరంలో కడ్కోల వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో కారులో ప్రహ్లాద్ మోదీ, ఆయన భార్య, కుమారుడు, కోడలు, మనవడు ఉన్నారు. బెంగళూరు నుంచి బండీపురా వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్దింది.
ఈ ఘటనలో ప్రహ్లాద్ మోదీ, ఆయన మనవడు, కోడలికి గాయాలయ్యాయి. మోదీ మనవడి కాలు విరగడంతో పాటు తలకు కూడా గాయాలయ్యాయి. మిగతా కుటుంబసభ్యులు, డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న మైసూరు ఎస్పీ సీమీ లట్కర్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను వెంటనే మైసూరులోని జేఎస్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో మెర్సిడేజ్ కారు ముందు భాగం దెబ్బతిన్నది.
Read More Articles:
Telangana Congress | టీ కాంగ్రెస్ ఇంఛార్జి బాధ్యతల నుంచి తప్పుకున్న మాణిక్కం ఠాగూర్.. త్వరలో కొత్త ఇంఛార్జి
Metro Station | ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ పైనుంచి దూకిన వృద్ధురాలు.. స్పాట్లోనే మృతి
Telangana IPS | తెలంగాణలో భారీగా ఐపీఎస్ల బదిలీలు.. సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్రకు అదనపు బాధ్యతలు
Bandi Sanjay | యువతను బీజేపీకి దూరం చేసేందుకే నోటిఫికేషన్లు: బండి సంజయ్