Taraka Ratna | సినీ నటుడు నందమూరి తారకరత్న అస్వస్థతకు గురయ్యారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో నడుస్తుండగానే సొమ్మసిల్లి కిందపడిపోయాడు. వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించగా.. ఆయనకు గుండెపోటు వచ్చిందని నిర్ధారించారు. ఈ విషయాన్ని టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి వెల్లడించారు. గుండెకు రక్తం వెళ్లే రక్తనాళాల్లో బ్లా్క్ ఉందని గుర్తించినట్లు వైద్యులు తెలిపారని చెప్పారు. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ యువగళం పేరిట కుప్పంలో చేపట్టిన పాదయాత్రలో నందమూరి తారకరత్న పాల్గొన్నాడు. లక్ష్మీపురం శ్రీవరదస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలతో ఈ పాదయాత్ర ప్రారంభమైంది. పాదయాత్రలో భాగంగా దగ్గరలో ఉన్న మసీదులో కూడా లోకేశ్ ప్రార్థనలు నిర్వహించారు. అప్పుడు లోకేశ్తో పాటు తారకరత్న కూడా మసీదులోకి వెళ్లారు. అయితే ఒక్కసారిగా టీడీపీ కార్యకర్తలు, అభిమానులు తరలిరావడంతో ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. ఇదే విషయాన్ని అక్కడి ఉన్న వాళ్లకు తారకరత్న తెలియజేశాడు.
గాలి ఆడటం లేదని.. కొంచెం జరగాలని సిబ్బంది ఎంత చెప్పినా అభిమానులు వినిపించుకోలేదు. దీంతో ఊపిరి అందక సొమ్మసిల్లి పడిపోయాడు. ఈ హఠాత్పరిణామంతో తారకరత్నను హుటాహుటిన కుప్పంలోని కేసీ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం పీఈఎస్ వైద్య కళాశాలకు తరలించారు. అక్కడి వైద్యులు తారకరత్నను పరీక్షించి గుండెపోటుగా నిర్ధారించారు. విషయం తెలుసుకున్న నందమూరి బాలకృష్ణ హుటాహుటిన ఆస్పత్రికి తరలివెళ్లాడు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నాడు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Jamuna | టాలీవుడ్లో మరో విషాదం.. సినీ నటి జమున కన్నుమూత
Balakrishna | అక్కినేని తొక్కినేని వ్యాఖ్యలపై స్పందించిన బాలకృష్ణ.. వివాదం సద్దుమణిగినట్టేనా?
Balakrishna | బాలయ్య అనుచిత వ్యాఖ్యలపై ఎస్వీ రంగారావు వారసుల షాకింగ్ రెస్పాన్స్