Viral News | ఉద్యోగం చేసేవారు నిత్యం పని ఒత్తిడితో తీరిక లేకుండా గడుపుతుంటారు. పని ఎక్కువ అయినప్పుడు కొన్ని రోజులు సెలవు తీసుకుని విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటారు. చాలా మంది అయితే లాంగ్ టూర్లకు ప్లాన్ చేసుకుంటారు. కానీ కొన్ని సార్లు కుటుంబంతో సరదాగా ఎంజాయ్ చేద్దాం అనుకున్న సమయంలో కూడా ఆఫీసు నుంచి ఆ సందేహం ఉంది… ఈ అనుమానం ఉంది అంటూ ఫోన్లు వస్తుంటాయి. అలాంటి సమయంలో చిరాకుగా, విసుగుగా అనిపిస్తుంటుంది. ఆఫీసు పనుల వల్ల కుటుంబంతో పూర్తి సమయం కేటాయించలేం. అలా జరగకుండా ఉండేందుకు ముంబైకి చెందిన ఓ సంస్థ వైరటీ రూల్ తీసుకు వచ్చింది.
అది ఏంటి అంటే ఎవరైనా సెలవుల్లో ఉన్నప్పుడు వారిని ఆఫీసు నుంచి ఫోన్ చేసి పనికోసం విసిగిస్తే రూ.లక్ష జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఈ మేరకు ఫ్యాంటసీ స్పోర్ట్స్ ప్లాట్ఫామ్ డ్రీమ్ ఎలవెన్ పేర్కొంది. సంవత్సరంలో ఒక వారంపాటు ఉద్యోగులను పనికి దూరం ఉంచేందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది.
ఈ విషయం గురించి డ్రీమ్ ఎలవెన్ కో ఫౌండర్ భవిత్ సేత్ మాట్లాడుతూ… ఏడాదికి ఒకసారి వారం రోజుల పాటు పని ఒత్తిడి నుంచి ఉద్యోగులు పూర్తిగా దూరంగా ఉండాలి. అటువంటి వారికి మెయిల్స్ కానీ, కాల్స్ కానీ ఏమీ ఉండవు. అంతేకాకుండా దీని వల్ల సంస్థ కూడా ఎవరి పని మీద ఎక్కువ ఆధారపడి ఉంది అనేది కూడా మాకు తెలుస్తోంది అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఈ వ్యవస్థ చాలా ప్రభావవంతంగా పని చేస్తుందని తెలిపారు.
కుటుంబంతో ఉన్నప్పుడు ఎటువంటి ఒత్తిళ్లు లేకుండా సెలవులను గడిపితే.. ఉద్యోగులు కూడా రిలాక్స్ అవుతారని పేర్కొన్నారు. సెలవుల నుంచి వచ్చిన తరువాత వారు కొత్త ఉత్సాహంతో పనిచేసేందుకు ఎక్కువ అవకాశాలు కూడా ఉంటాయన్నారు. తమ సంస్థలో పని చేసే ఏ ఉద్యోగి అయినా సరే ఏడాదిలో వారం రోజుల పాటు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చని వివరించారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Veerasimha reddy Review | వీరసింహారెడ్డి రివ్యూ.. బాలయ్య మాస్ ఫార్ములా వర్కవుట్ అయ్యిందా?
Anupama parameswaran | డీజే టిల్లు సీక్వెల్లో అనుపమ ఫిక్స్.. అల్టర్నేట్ ప్రొఫేషన్ అంటూ పోస్టు