West Godavari | పశ్చిమగోదావరి జిల్లాలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తన ప్రేమను అంగీకరించలేదనే కోపంతో యువతితో పాటు ఆమె తల్లి, సోదరిపైనా కత్తితో విచక్షణా రహితంగా దాడిచేశాడు. ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో ఏలూరు ఆస్పత్రికి చికిత్స అందిస్తున్నారు.
తాడేపల్లిగూడెం మండలం కొండ్రుపోలులో గురువారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన రాజులపాటి కళ్యాణ్ కూలీ చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన యువతిని రెండు నెలలుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఆ యువతి అంగీకరించకపోవడంతో కక్ష పెంచుకున్నాడు. ఇదే విషయాన్ని యువతి తల్లిదండ్రులతో చెప్పడంతో పలుమార్లు కళ్యాణ్ను హెచ్చరించారు. దీంతో యువతిపై కోపం పెంచుకున్నాడు. గురువారం రాత్రి యువతిపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. యువతి దవడ, మెడ, వెన్నుముక, ఛాతిలో కత్తితో పొడిచాడు. ఆ సమయంలో యువతి తల్లి, చెల్లి అడ్డుకునే ప్రయత్నం చేశారు. మరింత రెచ్చిపోయిన కళ్యాణ్ వారిపైనా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు.
రక్తపు మడుగులో ఉన్న ముగ్గురిని స్థానికులు చికిత్స కోసం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు దాడికి పాల్పడిన కళ్యాణ్ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read More Articles:
Telangana Tourist Places | తెలంగాణలోని ఈ ఆలయంలో 700 ఏళ్లుగా వెలుగుతున్న అఖండజ్యోతి.. గంభీరావుపేటలోనే