Balakrishna | వీరసింహారెడ్డి సినిమా సక్సెస్ మీట్లో బాలయ్య మాట్లాడిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఎన్టీఆర్, ఎన్వీ రంగారావు, అక్కినేని.. తొక్కినేని అంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యలపై ఏయన్నార్ అభిమానులతో పాటు తెలుగు ఇండస్ట్రీలో చాలామంది ఫీలయ్యారు. దీనిపై సోషల్ మీడియాలో కూడా ట్రోల్స్ వచ్చాయి. ఈ కాంట్రవర్సీపై ఏయన్నార్ వారసులు అక్కినేని నాగచైతన్య, అఖిల్ ఇద్దరూ కూడా స్పందించారు. దీంతో ఈ వివాదం మరింత సీరియస్గా మారింది. దీనిపై ఎన్వీఆర్ వారసులు కూడా ఎలా స్పందిస్తారో చూడాలని అంతా ఉత్సుకతతో ఉన్నారు. ఈక్రమంలోనే ఎస్వీ రంగారావు మనవళ్లు ఈ వివాదంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
వీరసింహారెడ్డి సక్సెస్ మీట్లో బాలయ్య మాట్లాడిన విషయాలపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తుండటంతో ఈ విషయంపై స్పందిస్తున్నామని ఎస్వీ రంగారావు వెల్లడించారు. బాలకృష్ణతో తమ కుటుంబానికి మంచి అనుబంధం ఉందని తెలిపారు. తామంతా ఒక కుటుంబంలా ఉంటామని పేర్కొన్నారు. ఆ సక్సెస్ మీట్లో తోటి నటుడితో జరిగిన ఓ సంభాషణ గురించి మాత్రమే బాలకృష్ణ చెప్పాడని అన్నారు. దీనిలో తమకు ఎలాంటి కాంట్రవర్సీ కనిపించడం లేదని స్పష్టం చేశారు. మీడియాలో ఈ విషయాన్ని ఇంకా డ్రాగ్ చేయవదద్ని కోరారు. ఈ వివాదంలో తమ కుటుంబాన్ని తీసుకొచ్చి.. నందమూరి కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని చెడగొట్టవద్దని విజ్ఞప్తి చేశారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles: