Rahul Gandhi | రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ( RSS ), బీజేపీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను మహాభారతంలోని కౌరవులతో పోలుస్తూ ఎద్దేవా చేశారు. 21 శతాబ్దపు కౌరవులు ఖాకీ ప్యాంటు వేసుకుంటారని, చేతిలో లాఠీ పట్టుకుని తిరుగుతుంటారని ఆరోపించారు. దేశవ్యాప్తంగా శాఖలుగా విస్తరిస్తారని వ్యాఖ్యానించారు.
అంతేకాదు.. ఇప్పుడున్న కౌరవులకు ఇద్దరు ముగ్గురు కోటీశ్వరులు అండగా ఉంటారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. భారత్ జోడో యాత్రలో భాగంగా హరియాణాలో పర్యటిస్తున్న రాహుల్ ఈ విధంగా వ్యాఖ్యానించారు. నోట్ల రద్దు, జీఎస్టీ అమలు చేసింది ప్రధాని మోదీ అయినా ఆయన చేత సంతకం పెట్టించింది మాత్రం ఇద్దరు ముగ్గురు కోటీశ్వరులే అని ఆరోపించారు. మరోవైపు బీజేపీ నేతలను రాహుల్ గాంధీ పాండవులతో పోల్చారు.
ఒకప్పటి రాహుల్ గాంధీనీ కాదు..
పాండవులు నోట్లు రద్దు చేస్తారా? జీఎస్టీ అమలు చేస్తారా? ఎక్కడైనా పాండవులు విద్వేషాన్ని వ్యాప్తి చేయడం చేస్తారా ? అమాయకులపై నేరాలకు పాల్పడతారా? అంటూ తీవ్ర స్థాయిలో రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. పాండవులు అన్నిమతాల వారిని ఆదరించడమే కాదు.. అన్యాయాన్ని ఎదురిస్తారని వ్యాఖ్యానించారు. భారతీయ విలువలకు సంఘ్ వ్యతిరేకమన్న రాహుల్ గాంధీ.. హర హర మహదేవ్, జై శ్రీరామ్ అని ఏ రోజూ సంఘ్ కార్యకర్తల నోటి నుంచి రాలేదని వ్యాఖ్యానించారు. తాను ఒకప్పటి రాహుల్ గాంధీని కాదని తేల్చి చెప్పారు. అప్పటి రాహుల్ గాంధీ ప్రతిరూపాన్ని చంపేశానని కీలక వ్యాఖ్యలు చేశారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More: