Omicron BF.7 | ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కర్ణాటక సర్కారు కఠిన నిర్ణయాలు తీసుకుంది. బహిరంగ ప్రదేశాలే కాదు.. ఎక్కడికెళ్లినా మాస్క్ తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇంట్లో ఉన్నా.. ఆఫీసులో ఉన్నా మాస్క్ కచ్చితంగా ధరించాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. చైనాలో కల్లోలం సృష్టిస్తున్న ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్.7 భారత్లోకి ప్రవేశించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అంతేకాదు.. ఏసీ గదుల్లో ఉన్నా మాస్స్ను తప్పనిసరిగా ధరించాలని సూచించింది. దీంతో ఇప్పుడు సినిమా థియేటర్లలోనూ, షాపింగ్ మాల్స్లోనూ మాస్కులు తప్పనిసరి చేసింది. అలాగే జలుబు, దగ్గు ఉన్నా కరోనా పరీక్షలు కంపల్సరీ చేస్తూ కర్ణాటక సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గురువారం కర్ణాటక వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చిన నివేదిక ఆధారంగా సీఎం బొమ్మై ఈ నిర్ణయం తీసుకున్నారు.
కేంద్రం ఆదేశాల మేరకు ఇకపై కరోనా పాజిటీవ్ వచ్చిన శాంపిళ్లన్నీ జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపించనున్నట్లు కార్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వైద్యాధికారులను అప్రమత్తం చేశారు. బెడ్లు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ సిలిండర్లు, మందుల కొరత రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు.
Read More Articles |
Harish Rao | ఒమిక్రాన్ బీఎఫ్.7పై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. హరీశ్రావు ఉన్నతస్థాయి సమీక్ష