Russia | ఎలాగైనా ఉక్రెయిన్ని ఆక్రమించుకుందామని ప్రయత్నిస్తున్న రష్యా ఖజానా ఖాళీ అవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాదికి రష్యా వద్ద నగదు మొత్తం అయిపోతుందని, ఏవైనా మిత్ర దేశాలు సహాయంగా పెట్టుబడులు పెడితే తప్ప పుతిన్ ప్రభుత్వాన్ని గట్టేక్కించడం కుదురుతుందని రష్యలోని ప్రముఖ వ్యాపారవేత్త ఒలిగార్క్ ఒలెజ్ డెరిపాస్కా వివరించారు.
ఫ్యూయల్ అండ్ మెటల్ రంగానికి చెందిన వ్యాపారవేత్త అయిన ఒలెజ్.. కొద్ది కాలం క్రితం వరకు కూడా రష్యాలో కుబేరుల్లో ఒకరిగా ఉన్నారు. తాజాగా ఆయన సైబీరియాలో జరిగిన పెట్టుబడుల సదస్సులో ప్రసంగిస్తూ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాదికి దేశంలో డబ్బు ఉండదు. ఇప్పటికే నిధులు మొత్తం కరిగిపోతున్నాయి. దాని ప్రభావం వ్యాపార వేత్తల మీద పడుతోంది. దాని వలన మాకు విదేశీ పెట్టుబడులు అవసరం ఉంది’ అని తన దేశ పరిస్థితిని తెలియజేశారు.
ఎప్పుడైతే ఉక్రెయిన్ పై దాడి మొదలైందో అప్పటి నుంచి రష్యా మీద అనేక ఆంక్షలు మొదలైయ్యాయి. కొన్ని మిత్ర దేశాలు కూడా రష్యాను పక్కన పెట్టాలని ప్రయత్నిస్తున్నాయి. వాటిలో ముందు అమెరికా, బ్రిటన్, యూరోపియన్ యూనియన్ ప్రభుత్వం పై ఆంక్షలు విధిస్తున్నాయి. దాని వలన వాటి ప్రభావం అక్కడి వ్యాపారవేత్తల పై తీవ్రంగా ఉందని తెలుస్తోంది.
దాంతో అక్కడి వ్యాపారవేత్తలు తమ వ్యాపార సామ్రాజ్యాలను ఇతర దేశాల్లోకి విస్తరించే పనిలో ఉన్నారు. ఇంతకాలం మాది ఐరోపా దేశమని అనుకున్నాము. కానీ ఆసియాతో గతంలో మాకున్న బంధాల గురించి రానున్న కాలంలో మేం ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చిందని ఒలెజ్ వ్యాఖ్యానించారు.
యూరోపియన్ రేటింగ్స్ ఏజెన్సీ అనే సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. రష్యా జీడీపీలో ద్రవ్యలోటు 3.5 శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది.
ముఖ్యంగా చమురు, గ్యాస్ ఇంధన ఎగుమతుల నుంచి వచ్చే ఆదాయం పడిపోవడమే ఇందుకు ముఖ్య కారణమని తెలిపింది. అయితే దీనికి ముందు పుతిన్ ప్రభుత్వం నుంచి వచ్చిన అంచనా మాత్రం రెండు శాతంగానే ఉండటం గమనార్హం.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Rahul Gandhi | ఆ సమయంలో నన్ను చంపేసేవారమో.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు!
Emoji | ఎమోజీల ట్రెండ్ ఎలా మొదలైంది? అవి పసుపు రంగులోనే ఎందుకు ఉంటాయి?
First Video on Youtube | యూట్యూబ్లో ఫస్ట్ అప్లోడ్ చేసిన వీడియో ఏంటో తెలుసా