Warship Sinks | థాయ్లాండ్లో ఓ యుద్ధ నౌక మునిగిపోయింది. గల్ఫ్ ఆఫ్ థాయ్లాండ్లో గస్తీ నిర్వహిస్తున్న నేవీ నౌక.. తుఫాను కారణంగా బోల్తా పడింది. స్థానిక కాలమాన ప్రకారం ఆదివారం రాత్రి 11:30 గంటలకు హెచ్టీఎంఏఎస్ నౌక నీటిలో మునిగిపోయింది. ప్రమాద సమయంలో వందమందికిపైగా నావికులు నౌకలో ఉన్నారు. ఈ ఘటనలో 75 మందిని కాపాడగా.. మరో 31 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం నౌకలు, హెలికాప్టర్ల సాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఆదివారం సాయంత్రం థాయ్లాండ్లోని ప్రచుప్ ఖిరి ఖాన్ ప్రావిన్స్లో సముద్ర తీరానికి 20 నాటికల్ మైళ్ల దూరంలో నౌక గస్తీలో పాల్గొంది. అదే సమయంలో ఈదురుగాలుల కారణంగా సముద్రపు నీరు యుద్ధ నౌకలోకి చేరుకుంది. దీని వల్ల విద్యుత్ వ్యవస్థ దెబ్బతింది.ఇంజిన్లు పనిచేయకపోవడం, కరెంట్ లేకపోవడం వల్ల నౌకలోకి భారీగా నీరు చేరడంతో ఒకవైపు వంగిపోయింది. మెల్లమెల్లగా నౌక నీటిలో బోల్తా పడిపోయింది. ఆ సమయంలో నౌకలో 106 మంది నేవీ సిబ్బంది ఉన్నారు. వీరిలో 75 మందిని రక్షించారు. నీటిలో గల్లంతైన 31 మంది కోసం ఆదివారం అర్ధరాత్రి నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నౌకలు, హెలికాప్టర్ల సాయంతో గల్లంతైన వారికోసం వెతుకుతున్నారు. అయితే ప్రతికూల వాతావరణం కారణంగా సహాయక చర్యలకు ఆటంకాలు కలుగుతున్నాయని అధికారులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలను థాయ్ నేవీ ట్వీట్ చేయడంతో వైరల్గా మారాయి.
Read More Articles |
Rythu bandhu | తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. రైతుబంధు పడేది అప్పట్నుంచే !!