China | చైనాలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. జీరో కొవిడ్ నిబంధనలు సడలించినప్పటి నుంచీ రోజురోజుకీ కేసులు గణనీయంగా పెరిగిపోతున్నాయి. అధికారికంగా కరోనా కేసులను చైనా ప్రకటించకపోయినప్పటికీ.. భారీ సంఖ్యలో ఇవి ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థలు అందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఏప్రిల్ నాటికి చైనా జనాభాలో 30 శాతం మంది కరోనా బారిన పడతారని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్కు సంబంధించిన ఐహెచ్ఎంఈ ఆందోళన వ్యక్తం చేసింది. 2023లో కరోనా మరణాల సంఖ్య 3.22 లక్షలకు చేరుకోవచ్చని ఐహెచ్ఎంఈ డైరెక్టర్ క్రిస్టఫర్ ముర్రె హెచ్చరించారు. ఈ క్రమంలో చైనా ప్రజలు అప్రమత్తమయ్యారు. రోగ నిరోధక దృష్టిని పెంచుకోవడంపై ఫోకస్ పెట్టారు. ఇందుకోసం ఆయుర్వేద చిట్కాలను తెగ ఫాలో అవుతున్నారు. ఇమ్యూనిటీని పెంచుకోవడానికి నిమ్మకాయ రసం ( lemon juice ) గ్లాసులకు గ్లాసులు తాగేస్తున్నారు. దీంతో చైనాలో నిమ్మకాయలకు విపరీతంగా గిరాకీ పెరిగిపోయింది. ముఖ్యంగా చైనాలోని బీజింగ్, షాంఘై వంటి ప్రధాన నగరాల్లో ప్రజలు నిమ్మకాయలను తెగ కొనుక్కొని వెళ్తున్నారట. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో విటమిన్ సీ కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే విటమిన్ సీ ఎక్కువగా ఉండే నిమ్మకాయలతో పాటు నారింజ, పీచ్, పియర్స్ వంటి పండ్లను తినేందుకు, వాటి జ్యూస్ తాగేందుకు చైనా జనం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. వీటికోసం ఎగబడి మరీ దుకాణాల నుంచి సిట్రస్ పండ్లను కొనుగోలు చేస్తున్నారట.
5 రెట్లు పెరిగిన నిమ్మకాయల అమ్మకాలు
చైనా దేశం మొత్తానికి సరఫరా అయ్యే నిమ్మకాయల్లో 70 శాతం సిచుయాన్లోని అనియు కౌంటీ నుంచే వెళ్తుంటాయి. అయితే దేశంలో నిమ్మకాయల గిరాకీ ఏ రేంజ్లో పెరిగిందో ఆ ప్రాంతానికి చెందిన ఓ రైతు వివరించాడు. ఇంతకుముందు రోజుకు 5 నుంచి 6 టన్నుల నిమ్మకాయలు మాత్రమే అమ్ముడుపోయేవని.. గత వారం రోజులుగా 20 నుంచి 30 టన్నుల వరకు కొనుక్కెళ్తున్నారని చెప్పాడు. అంటే ఒక్క రైతు 4 నుంచి 5 రెట్లు అదనంగా నిమ్మకాయలు విక్రయిస్తున్నాడు. అంటే చైనా ప్రజలు నిమ్మకాయల కోసం ఎంతలా ఎగబడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే గిరాకీ ఇలాగే పెరిగిపోతే రానున్న రోజుల్లో నిమ్మకాయల కరవు వచ్చిన రావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Read More Articles |
Warship Sinks | సముద్రంలో మునిగిపోయిన నేవీ నౌక.. 31 మంది గల్లంతు
COVID19 | చైనాలో మళ్లీ కరోనా విజృంభణ.. ఏప్రిల్ నాటికి 30 శాతం మందికి కొవిడ్ వచ్చే ఛాన్స్
Mrs world | 21 ఏళ్ల తర్వాత భారత్కు దక్కిన మిసెస్ వరల్డ్ కిరీటం.. విజేతగా నిలిచిన వైజాగ్ టీచర్
Sazia Marri | మా దగ్గర అణుబాంబులు ఉన్నాయని మరిచిపోవద్దు.. భారత్కు పాక్ వార్నింగ్