Shashi Tharoor | వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అధికారంలో కోల్పోయే అవకాశాలను కొట్టిపారేయలేమని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ జోస్యం చెప్పారు. 2024లో బీజేపీకి గత ఎన్నికల్లో వచ్చినన్ని సీట్లు రావడం కష్టమేనని అన్నారు. దాదాపు 50 ఎంపీ సీట్లు తగ్గే అవకాశం ఉందన్నారు.
కేరళ లిటరేచర్ ఫెస్టివల్కు హాజరైన శశిథరూర్ తాజా వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్సభ ఎన్నికల్లో చాలా రాష్ట్రాల్లో బీజేపీ ఎంపీ సీట్లను కోల్పోతుందని అన్నారు. కేంద్రంలో అధికారం కోల్పోయే అవకాశాలు కూడా లేకపోలేదని జోస్యం చెప్పారు. 2019లో హరియాణా, గుజరాత్, రాజస్థాన్, బిహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్లలో బీజేపీ సాధించిన సీట్ల సంఖ్యను చూస్తే ఈ విషయం అర్థమవుతుందన్నారు.
గత ఎన్నికల సమయంలో పుల్వామా దాడులు, బాలాకోట్ స్ట్రైక్స్ బీజేపీకి చివరి నిమిషంలో కలిసి వచ్చాయని అన్నారు. ఈసారి మాత్రం అలాంటి పరిస్థితి ఉండకపోవచ్చన్నారు. ఒక వేళ బీజేపీ 50 స్థానాల్లో ఓడితే మిగతా పార్టీలన్ని కలిసి మెజార్టీ స్థానాలు దక్కించుకున్నట్లు అవుతుందని అన్నారు. అప్పుడు ఆ పార్టీల ఎంపీలతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉండొచ్చని శశిథరూర్ అన్నారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Air India | ఎయిరిండియా మూత్ర విసర్జన కేసులో ఊహించని ట్విస్ట్.. ఆమెపైనే శంకర్ ఆరోపణలు!
Santokh singh chaudhary | భారత్ జోడో యాత్రలో విషాదం.. గుండెపోటుతో కాంగ్రెస్ ఎంపీ మృతి
Kerala Schools | ఇక స్కూళ్లలో సర్… మేడమ్ అనాల్సిన అవసరం లేదు… ఓన్లీ టీచర్.. ఆదేశాలు జారీ !