తెలుగు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర, పశ్చిమ తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని, ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదారాబాద్ కు భారీ వర్ష సూచన ఉందని తెలిపింది.
అటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర-ఉత్తర దక్షిణ ద్రోణి ప్రభావంతో ఛత్తీస్ గడ్ నుంచి తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా సముద్ర మట్టానికి ద్రోణి విస్తరించిందని వాతావరణ శాఖ బులిటెన్ విడుదల చేసింది.
ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులన్నీ నిండిపోయాయి. ఎగువ నుంచి వచ్చి వరదతో చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా గోదావరి మహోగ్రరూపం దాల్చింది. ఉమ్మడి నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో భారీ పంట నష్టం సంభవించింది. భద్రాచలం చాలా వరకు నీట మునిగింది. అటు హైదారాబాద్ లో ఆదివారం ఒక్కరోజే 16 సెంటీమీటర్ల వర్షం కురిసింది.. అదీ 7 గంటల్లోనే. దీంతో పలు కాలనీలు జలదిగ్భందంలో ఇరుక్కుపోయాయి.
Read More Articles |
ఆలయాల్లోని గుండాల్లో,నదుల్లో నాణేలను ఎందుకు వేస్తారో తెలుసా? ఇలా వేయడం మంచిదేనా..?
ఒక వ్యక్తి ఎన్ని ఏళ్లు కిరాయి ఉంటే ఆ ఇల్లు అతని సొంతమవుతుంది?
Hallmark Gold | మీ బంగారు ఆభరణాలపై ఉన్న హాల్ మార్క్ అసలుదా.. నకిలీదా గుర్తించడం ఎలా?