Husband committed suicide | ప్రేమించిన అమ్మాయే సర్వస్వం అనుకున్నాడు.. ఆమె లేకపోతే జీవితమే లేదని భావించాడు.. పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నాడు.. కానీ మనసుపడ్డ అమ్మాయితే నూరేళ్ల జీవితం ఊహించుకున్న అతను.. ఏడు నెలలు కూడా కలిసి ఉండలేకపోయాడు. ఆమె వేధింపులు తాళలేక ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. హైదరాబాద్( Hyderabad )లోని ఆల్వాల్ వెంకటాపురం కాలనీలో మూడు రోజుల కిందట చోటు చేసుకున్న ఈ విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వనపర్తి జిల్లాకు చెందని దాసరి వినయ్ కుమార్ (27)కు తల్లిదండ్రులు లేరు. బతుకుదెరువు కోసం నగరానికి వచ్చిన వినయ్.. సఫిల్గూడలోని తన పెద్దమ్మ ఇంట్లో ఉంటూ ఒక స్టోర్లో ఉద్యోగంలో చేరాడు. అక్కడే పనిచేస్తున్న వినీలాతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. దీంతో ఈ ఏడాది మే 25న పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత వినీలా తల్లిదండ్రుల ఇంటికి సమీపంలోనే ఇంటిని అద్దెకు దిగారు. ఇటీవల వినయ్ ఖాళీగా ఉంటూ వినీలాపై ఆధారపడటంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో భర్త వినయ్పై ఆగస్టులో వినీలా ఆల్వాల్ పోలీస్ స్టేషన్లో కంప్లయింట్ చేసింది. అప్పుడు దంపతులు ఇద్దరినీ పిలుచుకుని ఆల్వాల్ పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.
అదే సమయంలో గర్భం దాల్చడంతో కొద్దిరోజులుగా వినీలా తల్లిదండ్రుల వద్దనే ఉంటుంది. ఈ క్రమంలోనే ఏమైందో ఏమో ఇంట్లో ఒంటరిగా ఉంటున్న వినయ్.. మూడు రోజుల కింద ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడాడు. సోమవారం రాత్రి ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. తలుపులు తెరిచి చూడగా కుళ్లిపోయిన స్థితిలో వినయ్ మృతదేహం కనిపించింది. కాగా, వినయ్ మృతికి వినీలా, అత్తమామల వేధింపులే కారణమని అతని సోదరి హారతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Read More Articles |
Harishrao | తెలంగాణపై కేంద్రం ప్రశంసల వర్షం.. జాతీయ స్థాయిలో రెండు అవార్డులు దక్కించుకున్న రాష్ట్రం
BRS Party | ఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీసును ప్రారంభించిన కేసీఆర్.. హాజరైన అఖిలేష్ యాదవ్, కుమారస్వామి