Fire Accident | సికింద్రాబాద్లోని స్వప్న లోక్ కాంప్లెక్స్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. నాలుగు, ఐదు, ఆరు అంతస్తుల్లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటల్లో చిక్కుకున్న పలువురిని ఫైర్ సిబ్బంది కాపాడారు. ఐదో అంతస్తులో మరికొందరు మంటల్లో చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. మరోవైపు మూడు అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేసేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. మంటలు పెరుగుతుండటంతో సమీప భవనాల్లో ఉన్న వారిని అధికారులు ఖాళీ చేపిన్నారు.
కాగా, అగ్ని ప్రమాదం గురించి తెలిసిన వెంటనే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రమాద స్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మంటల్లో చిక్కుకున్న వారందరినీ రక్షిస్తామని చెప్పారు. అటు హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి కూడా ప్రమాద స్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. లిఫ్ట్లో షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగినట్లు అధికారులు భావిస్తున్నారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Pawan Kalyan | రోజుకు 2 కోట్లు.. వైరల్గా మారిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్
Junior NTR | ఎంత పని చేశావు తారక్.. ఫ్యాన్ వార్ కు పెట్రోల్ పోసాడుగా..!
Oscars 2023 | ఆస్కార్ అవార్డు పోగొట్టుకుంటే ఎలా? అప్పుడు అకాడమీ ఏం చేస్తుంది?
Silicon Valley Bank | 100 రూపాయలకే సిలికాన్ వ్యాలీ బ్యాంకు యూకే యూనిట్ దక్కించుకున్న హెచ్ఎస్బీసీ