PM Modi | పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలో శుక్రవారం ప్రధాన మంత్రి మోడీ పరీక్షా పే చర్చ నిర్వహించారు. ఎంతో ఓపిగ్గా విద్యార్థులు అడిగిన ప్రశ్నలన్నింటికి సమాధానాలు చెప్పారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న రంగారెడ్డి జిల్లా జవహర్ నవోదయ స్కూల్ కి చెందిన అక్షర అనే విద్యార్థిని మోదీని ఓ ప్రశ్న అడిగింది. బహుభాషలపై పట్టు సాధించేందుకు ఎలాంటి కృషి చేయాలని మోదీని అడిగింది. దీనికి ప్రధాని మోదీ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. కార్మికులు నివసించే బస్తీలో ఓ చిన్నారిని ఉదాహరణగా చెప్పారు.
ఓ బస్తీలోని ఎనిమిదేళ్ల చిన్నారి మలయాళం, మరాఠీ, హిందీ, బెంగాల్, తమిళ్ మాట్లాడటం విని నేను చాలా ఆశ్చర్యపోయాను. అయితే ఆ చిన్నారికి అన్ని భాషలు ఎలా వచ్చాయని ఆరా తీశానని మోదీ చెప్పారు. అప్పుడు ఆ చిన్నారి ఇంటి పక్కన ఉండే ఒక్కో ఫ్యామిలీ.. ఒక్కో రాష్ట్రానికి చెందిన వారని… ఇలా ఎక్కడి నుంచో వచ్చిన వారు అందరూ ఒకే దగ్గర నివసించడం వల్ల ఆ చిన్నారి ఏక కాలంలో అనేక భాషలు నేర్చుకుందని తెలిపారు. బహు భాషల మీద పట్టు సాధించుకోవడం కోసం ప్రత్యేకంగా క్వాలిఫికేషన్స్ ఏమి అక్కర్లేదని… నేర్చుకోవాలనే తపన, పట్టుదల ఉంటే చాలని మోదీ ఆ విద్యార్థినికి సూచించారు.
ప్రతిపక్షాలు, మీడియా విమర్శలను ఎలా ఎదుర్కొంటారని మరో విద్యార్థి ప్రధాని మోదీని ప్రశ్నించారు. దీనికి ప్రధాని చమత్కారంగా సమాధానమిచ్చారు. ఈ ప్రశ్న అవుట్ ఆఫ్ సిలబస్ అని చెప్పారు. దీంతో అక్కడ నవ్వులు విరబూశాయి. అనంతరం దీనికి సమాధానమిస్తూ.. ప్రజాస్వామ్యంలో విమర్శ అనేది ప్యూరిఫికేషన్ లాంటిది అని చెప్పారు. మీరు కష్టపడి పనిచేసే నిజాయితీపరులైతే విమర్శలను పట్టించుకోవద్దని సూచించారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Jamuna | టాలీవుడ్లో మరో విషాదం.. సినీ నటి జమున కన్నుమూత
Taraka Ratna | నందమూరి తారకరత్నకు గుండెపోటు.. లోకేశ్ యువగళం యాత్రలో సొమ్మసిల్లి పడిపోయిన టీడీపీ నేత
Balakrishna | అక్కినేని తొక్కినేని వ్యాఖ్యలపై స్పందించిన బాలకృష్ణ.. వివాదం సద్దుమణిగినట్టేనా?
Balakrishna | బాలయ్య అనుచిత వ్యాఖ్యలపై ఎస్వీ రంగారావు వారసుల షాకింగ్ రెస్పాన్స్