Ambati Rambabu | ఆంధ్రప్రదేశ్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు జిల్లా కోర్టు షాకిచ్చింది. అంబటిపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. సత్తెనపల్లిలో వైఎస్ఆర్ సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో అంబటి రాంబాబు నేతృత్వంలో టికెట్లు అమ్ముతున్నారని జనసేన నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీనిపై పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీంతో గుంటూరు కోర్టును జనసేన నేతలు ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు అంబటి రాంబాబుపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని ఆదేశించింది. గతంలోనూ అంబటి రాంబాబుపై జనసేన నేతలు ఆరోపణలు చేశారు. ప్రమాదంలో కుమారుడు చనిపోయిన మహిళకు ప్రభుత్వం నుంచి పరిహారం వచ్చింది. అందులో అంబటి వాటా అడిగారని జనసేన నేతలు ఆరోపించారు. బాధితురాలు కూడా రాంబాబుపై తీవ్ర ఆరోపణలు చేసింది. దీనికి సంబంధించి బాధితురాలు మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో అప్పట్లో వైరల్గా మారింది.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
RRR Naatu Naatu | రికార్డులు సృష్టిస్తున్న ఆర్ఆర్ఆర్.. నాటు నాటు సాంగ్కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు
Youtube shorts | యూట్యూబ్లో షార్ట్స్ చేసేవారికి గుడ్న్యూస్.. ఇలా చేస్తే లక్షలు సంపాదించవచ్చట
IRCTC Train Ticket | జర్నీలోనే మీ స్లీపర్ టికెట్ను ఏసీ కోచ్లోకి మార్చుకోవాలా? ఇలా చేస్తే సరి !!
Sankranti Holidays | గుడ్ న్యూస్.. సంక్రాంతి సెలవులు పొడిగించిన ప్రభుత్వం