Anil kumar Yadav | రాబోయే రోజుల్లో కూడా నెల్లూరు నగరం నుంచే పోటీ చేస్తానని ఏపీ మాజీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. . టీ షాపుల దగ్గర మాట్లాడే వారందరూ కూడా రాసిపెట్టుకొండి… అందరికీ చెప్తున్నానని పేర్కొన్నారు. అనిల్ అనేవాడు నెల్లూరు నగరం నుంచే పోటీ చేస్తాడని పునరుద్ఘాటించారు.
అనిల్ అనే వ్యక్తి జగన్ గీసిన గీత దాటడు అని మళ్లీ చెప్తున్నాను అని స్పష్టం చేశారు.
‘ రాష్ట్రంలో అనిల్ అనే వ్యక్తి ఎవరికైనా తల వంచితే అది కేవలం ఒక్క జగన్ ముందు తప్పితే ఇంకొకరి ముందు తల వంచే ప్రసక్తే లేదు. కొందరు శునకానందాన్ని పొందుతున్నారు. వారు మరికొన్ని రోజులు ఆ ఆనందాన్ని పొందండని.. ప్రశాంతంగా నిద్రపోండి’ అని చురకలంటించారు.
తనకు టికెట్ రాదనుకునే వారు ఇప్పుడైనా ప్రశాంతంగా నిద్రపోవాలని ఎద్దేవా చేశారు. 2024 ఎన్నికల్లో నెల్లూరు నుంచే పోటీ చేస్తానని అన్నారు. ఈ నాలుగు రోజులైనా ప్రశాంతంగా నిద్రపోవాలని .. తాను పోటీ చేసిన తర్వాత వారంతా కూడా నిద్రలేని రాత్రులు గడపాల్సి ఉంటుందని హెచ్చరించారు. ‘ కొందరు జీవితంలో మరింత దిగజారిపోతున్నారు. వారంతా బతికి ఉన్నా ఓడిపోయినట్లే. నా తప్పు లేకుండా తల వంచేది లేదు. రాజకీయాలు ఉంటాయి.. పోతాయి.. బతికినా… చచ్చినా సింహంలాగే ఉంటాను ‘ అని పేర్కొన్నారు.
ఎంతమంది తనకు వ్యతిరేకంగా వచ్చినా ఫర్వాలేదని, తట్టుకుని నిలబడగలను అంటూ వ్యాఖ్యానించారు. నన్ను ఏదో ఇబ్బందిపెడుతున్నారని కాళ్లు మొక్కే పని కూడా ఉండదన్నారు. ఆ శునకానందాన్ని పొందేవారందరికీ ఇదే నా సమాధానమంటూ అనిల్ కుమార్ యాదవ్ ఘాటు విమర్శలు చేశారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Pawan Kalyan | కొండగట్టులో వారాహికి ప్రత్యేక పూజలు చేయించిన పవన్ కళ్యాణ్.. అక్కడే ఎందుకు?