Lalit Modi | ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొవిడ్తో పాటు న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన ప్రస్తుతం లండన్లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆక్సిజన్ సాయంతో బెడ్ మీద ఉన్నారు. ఈ విషయాన్ని లలిత్ మోదీ స్వయంగా ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు.
వారం రోజుల వ్యవధిలో తనకు రెండు సార్లు కొవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. వాతావరణ మార్పులు కారణంగా న్యూమోనియా కూడా తీవ్రంగా ఉందన్నారు. ఆ కారణాలతోనే తాను ఆసుపత్రిలో చేరినట్లు వెల్లడించారు. రెండు వారాలుగా తాను కొవిడ్, ఇన్ ఫ్లూ యెంజా, న్యూమోనియాతో బాధపడుతున్నట్లు చెప్పారు.ఈ క్రమంలో మూడు వారాల పాటు హోం క్వారంటైన్లో ఉన్నట్లు చెప్పారు.
మొదటి సారి కోవిడ్ సోకిన సమయంలో లలిత్ మోడీ మెక్సికోలో మూడు వారాల పాటు హోం క్వారంటైన్లో ఉన్నారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోగా తగ్గింది. అయితే మళ్లీ కరోనా పాజిటీవ్ రావడంతో మెక్సికో నుంచి ఎయిర్ అంబులెన్స్లో ఇద్దరు డాక్టర్లు, కుమారుడి సహాయంతో లండన్కు వచ్చి ఆస్పత్రిలో చేరారు. అయితే ఇప్పుడు 24 గంటలు ఆక్సిజన్ సహాయంతోనే ఉండాల్సి వస్తోందని స్వయంగా వెల్లడించారు. ఆరోగ్యం క్షీణించినప్పటికీ తాను కోలుకోవాలని ప్రార్థించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేసేందుకే పోస్ట్ పెట్టినట్లు పేర్కొన్నారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
COVID in China | చైనాలో 90 కోట్ల మందికి సోకిన కరోనా.. ఇంకో రెండు నెలల్లో మరింత విజృంభించే ఛాన్స్
Air India | ఎయిరిండియా మూత్ర విసర్జన కేసులో ఊహించని ట్విస్ట్.. ఆమెపైనే శంకర్ ఆరోపణలు!
Santokh singh chaudhary | భారత్ జోడో యాత్రలో విషాదం.. గుండెపోటుతో కాంగ్రెస్ ఎంపీ మృతి
Kerala Schools | ఇక స్కూళ్లలో సర్… మేడమ్ అనాల్సిన అవసరం లేదు… ఓన్లీ టీచర్.. ఆదేశాలు జారీ !