Jaishankar | చైనా విషయంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్య జై శంకర్ విరుచుకుపడ్డారు. చైనా 1962 లో భారత భూభాగాన్ని ఆక్రమించుకుందని.. అయితే నిన్ననే ఆ భూమిని చైనా ఆక్రమించుకుందంటూ తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని పరోక్షంగా రాహుల్ గాంధీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
జై శంకర్ రాసిన పుస్తకం ది ఇండియా వే అనే పుస్తకం మరాఠీ అనువాదం భారత్ మార్గ్ ఆవిష్కరణ మహారాష్ట్రలోని పుణేలో జరిగింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. చైనా గురించి మాట్లాడేందుకు మన దేశంలోని రాజకీయ నేతలకు ధైర్యం సరిపోవడం లేదంటూ చేసిన విమర్శలపై జైశంకర్ స్పందించారు. ప్రతిపక్ష పార్టీల్లో కొందరు నేతలు అటువంటి ఆలోచనా ధోరణిలో ఉన్నారు. దీనిని అర్ధం చేసుకోవడం చాలా కష్టమని పేర్కొన్నారు. ”వారికి ఆత్మవిశ్వాసం ఎందుకు లేదు? వారు ఎందుకు ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారు? చైనా గురించి తప్పుడు వార్తలను ఎందుకు వ్యాపింపజేస్తున్నారు? అని మీరు నన్ను అడిగితే, ఈ ప్రశ్నలకు నేను ఎలా జవాబు చెప్పగలను? వారు కూడా రాజకీయాలు చేస్తున్నారని నాకు తెలుసు. నిజం కాదని తెలిసినప్పటికీ, ఉద్దేశపూర్వకంగానే అటువంటి వార్తలను వ్యాపింపజేస్తున్నారంటూ విమర్శించారు.
కొన్నిసార్లు వారంతా 1962లో చైనా తీసుకున్న భూమి గురించి మాట్లాడతారు. కానీ వారు ప్రజలకు నిజాలు చెప్పరు అంటూ జైశంకర్ విమర్శించారు. అది నిన్ననే జరిగిందనే అభిప్రాయాన్ని అందరికీ కలిగిస్తారు అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ క్రమంలోనే 2017లో రాహుల్ చైనా రాయబారిని కలవడం గురించి కూడా విమర్శలు చేశారు. దురాక్రమణల సమాచారం తెలుసుకోవడానికి తాను మాత్రం చైనా వారిని కలవను అంటూ ఎద్దేవా చేశారు. ఏదైనా సమాచారం కావాలంటే మన దేశ సైనికులనే అడిగి తెలుసుకుంటానని ఎద్దేవా చేశారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Australian Open | సంచలనం సృష్టించిన నొవాక్ జకోవిచ్.. నాదల్ రికార్డును సమం చేసిన సెర్బియా దిగ్గజం
mobiles on plane | విమానం ఎక్కగానే మొబైల్ స్విచ్చాఫ్ చేయమని ఎందుకు చెబుతారు?
Money in Dreams | కలలో డబ్బులు కనిపిస్తే అదృష్టమా? దురదృష్టమా?
Legal Advice | భర్త కనిపించకుండా పోతే భార్యకు ఆస్తి దక్కుతుందా? దీనికి ఏం చేయాలి?
Temples | ఆలయాల్లోని గుండాల్లో,నదుల్లో నాణేలను ఎందుకు వేస్తారో తెలుసా? ఇలా వేయడం మంచిదేనా..?