Home Latest News Amshala Swamy | ఫ్లోరోసిస్ బాధితుడు అంశాల స్వామి మృతి.. సంతాపం తెలిపిన కేటీఆర్

Amshala Swamy | ఫ్లోరోసిస్ బాధితుడు అంశాల స్వామి మృతి.. సంతాపం తెలిపిన కేటీఆర్

Amshala Swamy | ఫ్లోరోసిస్ బాధితుడు అంశాల స్వామి (32 ) మరణించాడు. ప్రమాదవశత్తూ బైక్‌పై నుంచి కిందపడటంతో తీవ్రంగా గాయపడ్డ స్వామి.. పరిస్థితి విషమించడంతో శనివారం ఉదయం కన్నుమూశాడు. అంశాల స్వామి మృతి పట్ల తెలంగాణ మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేటీఆర్ ట్వీట్ చేయడంతో స్వామి మరణించిన విషయం అందరికీ తెలిసింది.

నల్లగొండ జిల్లా శివన్నగూడెం గ్రామానికి చెందిన అంశాల స్వామి శుక్రవారం సాయంత్రం ఇంటివద్ద బైక్‌పై నుంచి కిందపడిపోయాడు. మెడ దగ్గర గాయం కావడంతో గ్రామంలోనే చికిత్స తీసుకున్నాడు. కానీ గాయం కారణంగా అతని పరిస్థితి విషమించింది. దీంతో శనివారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచాడు. స్వామి మరణం పట్ల మంత్రి కేటీఆర్ సంతాపం తెలిపారు. ‘ ఫ్లోరైడ్ సమస్యలపై అంశాల స్వామి అవిశ్రాంతంగా పోరాడి గెలిచారు. ఆయన ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు. స్వామి ఎప్పటికీ నా మనసులో ఉండిపోతాడు.’ అంటూ ట్వీట్ చేశారు.

అంశాల స్వామి చిన్నతనంలోనే ఫ్లోరోసిస్ బారిన పడ్డారు. దీంతో తనలా మరెవరూ ఫ్లోరైడ్ బారిన పడవద్దని అవిశ్రాంతంగా పోరాడారు. ఫ్లోరైడ్ బాధితుల తరఫున తన గళం వినిపించారు. ఆయన కృషిని గుర్తించిన మంత్రి కేటీఆర్ ఒక ఇంటిని కూడా కట్టించారు. తాజాగా మునుగోడు ఉప ఎన్నిక సమయంలో టీఆర్ఎస్‌కు ఆయన మద్దతు ప్రకటించారు. ఎన్నికల ప్రచార సమయంలో స్వామి ఇంటికి వెళ్లి తెలంగాణ మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి భోజనం కూడా చేశారు. ఈ ఎన్నికల సమయంలో అంశాల స్వామి గురించి అందరికీ తెలిసింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Tarakaratna Health Update | తారకరత్న కుప్పం నుంచి బెంగళూరు నారాయణ ఆస్పత్రికి తరలింపు

Kodali Nani | నందమూరి వారసులకు భయపడే నారా లోకేశ్ పాదయాత్ర.. యువగళంపై కొడాలి నాని కౌంటర్

Pawan Kalyan | పవన్ కళ్యాణ్‌కు.. కేఏ పాల్‌కు పెద్ద తేడా లేదు.. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్

Vishnu Priya | యాంకర్ విష్ణు ప్రియ ఇంట విషాదం.. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టు

TTD | అరచేతిలో వైకుంఠనాథుడి విశేషాలు.. మొబైల్‌లో ఒక్క క్లిక్‌తోనే శ్రీవారి దర్శనం టికెట్లు, రూమ్స్ అన్నీ బుక్ చేసుకోవచ్చు

Exit mobile version