WPL Champion | ముంబయి మహిళల జట్టు డబ్ల్యూపీఎల్ తొలి విజేతగా రికార్డు సృష్టించింది. ముంబై వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
ఢిల్లీ బౌలర్లు కట్టడి చేసే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ముంబయి బ్యాటర్ నాట్సీవర్ బ్రంట్ 55 బంతుల్లో 7 ఫోర్లతో 60 పరుగులు చేసి నాటౌట్గా నిలిచింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 37 పరుగులు చేసింది. వీరిద్దరూ ముంబయి విజయంలో కీలక పాత్ర పోషించారు. కాగా, రాధా యాదవ్, జొనాసెన్ చెరో వికెట్ తీశారు.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. కెప్టెన్ మెగ్ లానింగ్ 35, శిఖా పాండే 27, రాధా యాదవ్ 27 పరుగులు చేశారు. మిగిలిన వాళ్లు పెద్దగా స్కోర్ చేయలేకపోయారు. ముంబై బౌలర్లలో వాంగ్,. హెయిలీ చెరో మూడు వికెట్లు, అమీలా రెండు వికెట్లు తీసింది.