Thursday, April 25, 2024
- Advertisment -
HomeLatest NewsSabarimala accident | శబరిమల యాత్రలో విషాదం.. 8మంది అయ్యప్ప భక్తులు దుర్మరణం

Sabarimala accident | శబరిమల యాత్రలో విషాదం.. 8మంది అయ్యప్ప భక్తులు దుర్మరణం

టైమ్ టు న్యూస్, థేని : శబరిమల ( sabarimala ) యాత్రలో విషాదం చోటు చేసుకుంది. అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి లోయలో పడటంతో 8 మంది దుర్మరణం చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 9 ఏళ్ల చిన్నారి కూడా మృతిచెందడం గమనార్హం. శుక్రవారం తెల్లవారుజామున తమిళనాడులోని థేని జిల్లాలో చోటు చేసుకుంది.

తమిళనాడులోని అండిపట్టి జిల్లాకు చెందిన 10 మంది అయ్యప్ప భక్తులు శబరిమలను దర్శించుకుని తిరిగి వస్తున్నారు. కుమౌలీ కొండల ప్రాంతానికి రాగానే ఓ మలుపు వద్ద కారు అదుపుతప్పింది. 40 అడుగుల లోతున్న లోయలో పడింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అర్ధరాత్రి 11 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. కాగా ఈ ఘటనపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి మురళీధరన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Kaikala Satyanaraya | మహాప్రస్థానంలో ముగిసిన కైకాల అంత్యక్రియలు

Hyderabad flats | హైదరాబాద్‌లో రూ.13 లక్షలకే సింగిల్ బెడ్‌రూం.. HMDA మరో అవకాశం

Dubai lottery | దుబాయిలో రూ.33 కోట్ల లాటరీ గెలుచుకున్న జగిత్యాల యువకుడు.. డ్రైవర్‌గా వెళ్లి కోటీశ్వరుడయ్యాడు

Kaikala Satyanarayana | కేజీఎఫ్ సినిమా సక్సెస్ అయితే కైకాలకు ఎందుకు సన్మానం చేశారు?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News