Train Accident | తెలంగాణలోని మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ రైల్వేస్టేషన్ పరిధిలోని అంకుషాపూర్ సమీపంలో గోదావరి ఎక్స్ప్రెస్ప రైలు పట్టాలు తప్పింది. విశాఖ పట్నం నుంచి హైదరాబాద్ వెళ్తున్న రైలులోని ఆరు బోగీలు పట్టాలు తప్పాయి. రైలు వేగం తక్కువగా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. అయితే సుమారు కిలోమీటర్ మేర ట్రాక్ దెబ్బతిన్నది.
రైలు పట్టాలు తప్పడంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే ఎవరికీ గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. గోదావరి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పడంతో కాజీపేట-సికింద్రాబాద్ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. రైల్వే అధికారులు ప్రమాద స్థలానికి చేరుకుని ప్రయాణికులను గమ్యస్థానాలకు పంపించారు. ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Shruti haasan | రూమర్స్కు అలా చెక్ పెట్టిన శృతి హాసన్.. నా ప్రియుడు నాకే సొంతం..!
WPL 2023 Schedule | డబ్ల్యూపీఎల్ నగారా.. తొలి సీజన్ షెడ్యూల్ విడుదల చేసిన బీసీసీఐ
Kuthuhalamma | ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ స్పీకర్ కన్నుమూత
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ గారూ.. చెప్పినంత ఈజీ కాదు సర్ డేట్స్ ఇవ్వడం..!
Shah rukh khan | షారుక్ ఖాన్ ఇటు వైపు నుంచి నరుక్కొస్తున్నాడా.. పెద్ద ప్లానే ఇది..!
Ramcharan | ఆ కొరియోగ్రఫర్తో కలిసి మెగా ట్రీట్ ఇచ్చిన రామ్ చరణ్..