Aravind Kejriwal | దేశంలో ప్రజాస్వామ్యం ప్రస్తుతం ప్రమాదంలో ఉందని.. దానికి కారణం బీజేపీనే అని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఇండియా తరువాత స్వాతంత్య్రం సాధించిన దేశాలు కూడా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుంటే.. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లైనా భారత్ ఇంకా పేదరికంలోనే ఎందుకు మగ్గుతుందని ఆయన ప్రశ్నించారు.
కేసీఆర్ పెద్దన్న లాంటి వారు..
ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడుతూ.. తనను తెలంగాణకు పిలిచి రెండు మంచి కార్యక్రమాల్లో పాల్గొనేలా చేసిన సీఎం కేసీఆర్కి కృతజ్ఙతలు చెబుతున్నానని అన్నారు. కంటి వెలుగు అత్యద్భుతమైన పథకమని అన్నారు. దీన్ని త్వరలోనే ఢిల్లీ, పంజాబ్లోనూ అమలు చేస్తామని అన్నారు. కేసీఆర్ తనకు పెద్దన్నయ్య లాంటి వారని అన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గవర్నర్లను అడ్డు పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వాలను బెదిరింపులకు గురి చేస్తుందని కేజ్రీవాల్ మండిపడ్డారు. రోజు మొదలుకొని ఎప్పుడూ ఎవరిని బెదిరించి వేధింపులకు గురి చేద్దామనే ఆలోచనలోనే మోదీ ఉంటారని ఆయన ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ సర్కార్ ఓ నియంత లాగా వ్యవహరిస్తోంది అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల ప్రభుత్వాలను కేంద్రం వేధిస్తోందన్నారు. గవర్నర్ వ్యవస్థ ద్వారా మోదీ సర్కార్ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. ప్రధాని మోదీ స్వయంగా గవర్నర్లను రాజకీయంగా తెగ వాడేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
CM KCR | బీఆర్ఎస్ పార్టీని అందుకే పెట్టాల్సి వచ్చింది.. ఖమ్మం బహిరంగ సభలో తెలంగాణ సీఎం కేసీఆర్
KCR | వచ్చే ఎన్నికల్లో బీజేపీని గద్దె దించుతాం.. ఖమ్మం సభలో తెలంగాణ సీఎం కేసీఆర్
IT Rides | హైదరాబాద్లో మరోసారి ఐటీ రైడ్స్.. ఈసారి రియల్ ఎస్టేట్ సంస్థలు, బిల్డర్లపై!
CM KCR | బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశమంతా ఇవి అమలు చేస్తాం.. సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన
CM KCR | ఖమ్మం ప్రజలకు తెలంగాణ సీఎం కేసీఆర్ వరాల జల్లులు
Khammam Sabha | ఖమ్మం సభ దేశానికి ఒక దిక్సూచి.. కేసీఆర్పై కేరళ సీఎం ప్రశంసలు