Amit shah | కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రయాణిస్తున్న విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. త్రిపుర రాజధాని అగర్తలలోని మహారాజా బిర్ బిక్రమ్ విమానాశ్రయంలో విమానం బుధవారం రాత్రి ల్యాండ్ కావాల్సింది. కానీ దట్టమైన పొగమంచు కారణంగా విమానాన్ని దారి మళ్లించారు. దీంతో గువాహటి లోని లోక్ ప్రియ గోపినాథ్ బోర్డోలాయ్ విమానాశ్రయంలో ల్యాండైంది. బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది.
ఈ ఏడాది త్రిపురలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే ప్రచార ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు గురువారం రెండు రథయాత్రలను ప్రారంభించేందుకు అమిత్ షా అగర్తలా వెళ్లేందుకు ఢిల్లీ నుంచి విమానంలో బయలుదేరారు. అయితే పొగమంచు కారణంగా గువాహటికి మళ్లించారు. అయితే ప్రచార రథాలను యథావిధిగా అమిత్ షా ప్రారంభిస్తారని అధికారిక వర్గాలు వెల్లడించాయి.
Read More Articles:
Uber ride via Whatsapp | ఇక వాట్సాప్లోనే ఉబెర్ క్యాబ్ బుక్ చేసుకోవచ్చు.. ప్రాసెస్
Whatsapp | మళ్లీ ఆ ఫీచర్ను తీసుకొస్తున్న వాట్సాప్.. రీజన్ ఇదే
Unlock your mobile | మీ మొబైల్ పిన్ మరిచిపోయారా? ఫోన్ను ఇలా అన్లాక్ చేయండి
Tech tips | మీకు వచ్చే ప్రతి మెయిల్స్ ఓపెన్ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకుంటే మీ పని అంతే !