MLC Kalvakuntla Kavitha | ఢిల్లీ లిక్కర్ కేసులో విచారించేందుకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటికి సీబీఐ అధికారులు చేరుకున్నారు. రెండు బృందాలుగా వచ్చిన అధికారులు.. సీఆర్పీసీ 160 కింద కవిత వాంగ్మూలం తీసుకోనున్నారు. సాయంత్రం వరకు విచారణ కొనసాగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈ నెల 6న విచారణకు హాజరుకావాలని ఎమ్మెల్సీ కవితకు సీబీఐ అధికారులు మొదట సూచించారు. అయితే ఆరోజు తనకు ఇతర కార్యక్రమాలు ఉన్నాయని.. 11, 12, 14, 15వ తేదీల్లో అందుబాటులో ఉంటానని సీబీఐ లేఖకు బదులిచ్చారు. ఈ క్రమంలోనే సీబీఐ అధికారులు హైదరాబాద్లోని కవిత నివాసానికి చేరుకుని విచారణ చేస్తున్నారు.
సీబీఐ విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కల్వకుంట్ల కవితకు సంఘీభావం తెలుపుతున్నారు. బంజారాహిల్స్లోని ఆమె నివాసానికి తరలివచ్చి మేమున్నామంటూ అండగా నిలబడుతున్నారు. డాటర్ ఆఫ్ ఫైటర్.. విల్ నెవర్ ఫియర్, వియ్ ఆర్ విత్ అంటూ కవిత నివాసం ముందు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.ఈ క్రమంలో కవిత నివాసం వద్ద పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు
Read More Articles |
TSRTC Special Offer | అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. శబరిమలకు ఆర్టీసీ స్పెషల్ బస్సులు
Nizamabad Bride | కాసేపట్లో పెళ్లనగా పెళ్లికూతురు ఆత్మహత్య.. వరుడి వేధింపులే కారణమా?